Madhya Pradesh: దారుణం.. రిసార్టులో యువతి హత్య..!
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది.
- By Gopichand Published Date - 11:08 PM, Tue - 15 November 22
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. మేఖ్లా రిసార్టులో ఓ 25 ఏండ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించిన వీడియోను నిందితుడు వీడియో తీసి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. తాను, తన పార్ట్నర్ కి ఓ యువతితో వివాహేతర సంబంధం ఏర్పడిందని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యువతి తన వ్యాపార భాగస్వామి నుంచి బాగా డబ్బులు తీసుకుందని నిందితుడు పేర్కొన్నాడు. యువతి మొత్తం రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిందని, దాంతో తన వ్యాపార భాగస్వామి ఆమెను హతమార్చాలని తనకు చెప్పాడని, అందుకే తాను ఆమెను హత్య చేశానని ప్రధాన నిందితుడు ఆ వీడియోలో వివరించాడు.
ఈ హత్యలో తమ ఇద్దరికీ ప్రమేయం ఉందని స్పష్టం చేశాడు. దాంతోపాటు యువతి రక్తపు మడుగులో ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు. కానీ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశాడు. సీసీ ఫుటేజ్ పరిశీలించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఈ నెల 6న మేఖ్లా రిసార్టులో రూమ్ బుక్ చేశాడు. 7న యువతి అతడి గదికి వచ్చింది. ఆ తర్వాత తినడానికి ఏదో ఆర్డర్ చేశారు. ఆపై ఓ గంట సేపటికి నిందితుడు హోటల్ రూమ్కు తాళం వేసి వెళ్లిపోయాడు. 8న మధ్యాహ్నం అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది తాళం పగలగొట్టి చూడగా యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. హోటల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. పోలీసుల సైబర్ సెల్తో పాటు నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని అధికారి తెలిపారు.
Related News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..