Mamata Banerjee: నవీన్ పట్నాయక్ తో మమతా బెనర్జీ భేటీ.. కొత్త ఫ్రంటే లక్ష్యమా..?
లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత, భిన్న ఫ్రంట్లపై చర్చల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) గురువారం (మార్చి 23) ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ను కలిశారు.
- By Gopichand Published Date - 07:22 AM, Fri - 24 March 23
లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత, భిన్న ఫ్రంట్లపై చర్చల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) గురువారం (మార్చి 23) ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ను కలిశారు. భువనేశ్వర్లో బిజూ జనతాదళ్ (బిజెడి) అధ్యక్షుడు పట్నాయక్ను కలిసిన అనంతరం మమత మాట్లాడుతూ.. సమాఖ్య నిర్మాణాన్ని పటిష్టంగా, శాశ్వతంగా మార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
పట్నాయక్ మాట్లాడుతూ.. “ఇది మర్యాదపూర్వక సమావేశం. తీవ్రమైన రాజకీయ విషయాలపై లోతైన చర్చ జరగలేదు. మేము చాలా పాత స్నేహాన్ని పంచుకుంటాము.” 2024 లోక్సభ ఎన్నికల కోసం థర్డ్ ఫ్రంట్ లేదా ప్రాంతీయ కూటమికి సంబంధించిన ప్రశ్నలను ఇరువురు నేతలు పక్కన పెట్టారు. అంతకుముందు బెనర్జీ.. పట్నాయక్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఒడిశా ముఖ్యమంత్రి జగన్నాథుని వస్త్రాన్ని సమర్పించి ఆమెకు స్వాగతం పలికారు. తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానానికి మూడు రథాల ప్రతిరూపాన్ని కూడా బహూకరించారు. బెనర్జీ.. పట్నాయక్కు శాలువా కప్పి సత్కరించారు.
VIDEO | West Bengal CM @MamataOfficial meets Odisha CM @Naveen_Odisha in Bhubaneswar today. The West Bengal CM is on a three-day visit to Odisha. pic.twitter.com/k8mO4AjUGy
— Press Trust of India (@PTI_News) March 23, 2023
అంతకుముందు బుధవారం మమతా బెనర్జీ చారిత్రాత్మక జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. దీనితో పాటు పూరీకి వచ్చే ప్రజలు బస చేసేందుకు ‘బెంగాల్ నివాస్’ నిర్మాణానికి శ్రీ జగన్నాథ దేవాలయం సమీపంలో ప్లాట్ను ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది బెంగాలీలు పూరీకి వస్తుంటారని, వారిలో చాలా మంది బస చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ భూమి పూరి-బ్రహ్మగిరి రహదారిలో గిరాల వద్ద 12వ శతాబ్దపు ఆలయానికి కాస్త దూరంలో ఉంది.
Related News
Jaggareddy : సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగ్గారెడ్డి
సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరుతానంటే.. చేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఓపెన్ గా తెలిపారు