West Bengal : మమతకు “తన మంచి పనులు తెలుసు” – వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తృణమూల్ కాంగ్రెస్ నేత, మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేసింది. మంత్రికి సన్నిహితురాలు అయిన అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 20 కోట్లు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
- By hashtagu Published Date - 03:28 PM, Sat - 23 July 22
పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తృణమూల్ కాంగ్రెస్ నేత, మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేసింది. మంత్రికి సన్నిహితురాలు అయిన అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 20 కోట్లు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలకు సంబంధించి గతంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుర్గాపూజ కార్యక్రమంలో మమతా బెనర్జీ అర్పితను ప్రశంసించడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ కార్యక్రమంలో పార్థ ఛటర్జీ కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష బిజెపి నాయకుడు, సువేడు అధికారి రాష్ట్ర కో-ఇన్చార్జి అమిత్ మాల్వియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Not too long ago, Mamata Banerjee, from an open platform, praised Partha Chaterjee’s close aide, from whose residential premise, ED seized a small sum of 20 crore. Mamata knew of her and the “good work” she was doing. Make no mistake, Partha wasn’t scamming on his own accord… pic.twitter.com/JP0jmDaXoW
— Amit Malviya (@amitmalviya) July 23, 2022
గతంలో మమతా బెనర్జీ ఓపెన్ ఫోరమ్లో పార్థ ఛటర్జీ సాన్నిహిత్యాన్ని ప్రశంసించారు. ఆయన నివాసం నుండి రూ. 20 కోట్ల మొత్తాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. మమతకు ఆమె గురించి, ఆమె చేస్తున్న ‘మంచి పనులు’ తెలుసు. పార్థ స్వయంగా స్కామ్ను నడిపించలేదని అమిత్ మాల్వియా వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. కోల్కతాలో నటి, మోడల్ అర్పితా ముఖర్జీ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం దాడి చేసి రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
మంత్రి పార్థ ఛటర్జీని శుక్రవారం రోజంతా ఈడీ విచారించింది. విచారణలో అర్పిత ఇంటిపై దాడి చేశారు. దాదాపు 26 గంటల విచారణ అనంతరం మంత్రిని ఈడీ శనివారం ఉదయం అరెస్ట్ చేసింది. అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బు టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించినదని ఈడీ తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా ఆ వీడియోలో మమతా బెనర్జీ అర్పితపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘బెంగాల్ కూతురు అర్పిత ఒడిశాలో పనిచేస్తోంది..’ అని అన్నారు. ప్రముఖ దుర్గా పూజ కమిటీలో అర్పితా ముఖర్జీ ప్రముఖురాలు. ఆ వీడియో 2019లో దక్షిణ కోల్కతాలో పార్థ ఛటర్జీ నిర్వహించిన కార్యక్రమంలోనిది.
#WATCH | West Bengal cabinet minister and former Education Minister of the state Partha Chatterjee at ESI Joka Medical hospital with ED officials
Earlier today the minister was arrested by ED from his Kolkata residence in connection with the SSC recruitment scam pic.twitter.com/xD3fsrvmiS
— The Times Of India (@timesofindia) July 23, 2022
ఎవరీ పార్థ ఛటర్జీ…?
ప్రస్తుతం వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీ గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో జరిగిన కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాయి. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్థా పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కూడా కలిగి ఉన్నారు. 2014 నుంచి 2021 వరకు మమతా బెనర్జీ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 22, 2022
2001లో పార్థ తొలిసారి టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో మమత నేతృత్వంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందు నుంచి ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2016లో మమత రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆమె కేబినెట్లో ఉన్నత విద్య , పాఠశాల విద్య, వాణిజ్యం , పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా పనిచేశారు. కలకత్తా యూనివర్సిటీలో ఎంబీఐ పూర్తి చేసిన పార్థ ఆండ్రూ యూల్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేశారు.
Rs. 20 crore cash recovered by @dir_ed from the residence of Arpita Mukherjee; close aide of WB Education Minister Partha Chatterjee in the SSC scam case.
Sources claim that piles of cash were found inside WB Govt Education Ministry envelopes with
National Emblem printed on them. pic.twitter.com/xLsWQeVzL2— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 22, 2022
Related News
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.