Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఎస్పీ లోక్సభ ఎంపీ రితేష్ పాండే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు ఆదివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్
- Author : Praveen Aluthuru
Date : 25-02-2024 - 3:09 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Polls 2024: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఎస్పీ లోక్సభ ఎంపీ రితేష్ పాండే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు ఆదివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మరియు ఇతర బిజెపి నాయకుల సమక్షంలో రితేష్ పాండే బిజెపిలో చేరారు .బిఎస్పి అధ్యక్షురాలు మాయావతికి రితేష్ తన రాజీనామా లేఖను ఎక్స్ ద్వారా చేరవేశారు.
చాలా కాలంగా పార్టీ సమావేశాలకు నన్ను పిలవలేదని రితేష్ తెలిపారు. పార్టీ నాయకత్వం కూడా నాతో మాట్లాడలేదు. పార్టీ చీఫ్ మాయావతిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసాను, కానీ ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాబట్టి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. పార్టీతో సంబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయం భావోద్వేగంతో కూడుకున్నదని ఎంపీ అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని మాయావతిని పాండే కోరారు.
Also Read: Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల