HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Letter Of 500 Lawyers To Supreme Court Cji

Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ

  • By Latha Suma Published Date - 11:44 AM, Thu - 28 March 24
  • daily-hunt
Letter of 500 lawyers to Supreme Court CJI

 

Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మనన్‌ కుమార్‌ మిశ్రా, ఆదిష్‌ అగర్వాల్‌, చేతన్‌ మిట్టల్‌, పింకీ ఆనంద్‌, హితేష్‌ జైన్‌, ఉజ్వల వార్‌, ఉదయ్‌ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా దేశవ్యాప్తంగా 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని లేఖలో ఈ లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి.. కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ‘కొన్ని ప్రత్యేక బృందాలు’ ప్రయత్నిస్తున్నాయని న్యాయవాదులు ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ ఉద్దేశాలతో ఈ వర్గాలు నిరాధార ఆరోపణలు చేస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని లేఖలో ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తప్పుడు కథనాలను ప్రచారం చేయడంతో పాటు, ప్రస్తుత విచారణలను కించపరచడం.. న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని న్యాయవాదులు లేఖలో ప్రస్తావించారు. న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి, న్యాయస్థానాలను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఈ దాడులకు వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను కోరారు. సవాళ్లను పరిష్కరించడంలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కోరుతూ.. ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభంగా ఉండేలా న్యాయవ్యవస్థకు మద్దతుగా ఐక్యంగా నిలబడాలని లేఖలో న్యాయవాదు కోరారు.

Read Also:   MGNREGA: ఉపాధి హామీ కూలీల‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేత‌న రేటు పెంపు..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cji chandrachud
  • judiciary
  • lawyers
  • letter
  • Supreme Court

Related News

    Latest News

    • Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!

    • Aadhaar Update : అతి త్వరలో ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకునే సదుపాయం

    • BC Reservation : కవిత అరెస్ట్

    • Amaravati : అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

    • Gita Jayanti : గీతా జయంతి ఎప్పుడంటే ? భగవద్గీత ప్రాముఖ్యత ఇదే !

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd