HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Kharge Launches Bharat Jodo Nyay Yatra Logo And Tagline

Bharat Jodo Nyay Yatra : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్‌లైన్ ఆవిష్కరణ

Bharat Jodo Nyay Yatra : జనవరి 14న మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్ లైన్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.

  • Author : Pasha Date : 06-01-2024 - 2:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bharat Jodo Nyay Yatra
Bharat Jodo Nyay Yatra

Bharat Jodo Nyay Yatra : జనవరి 14న మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్ లైన్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.  ఈ యాత్ర కోసం  “న్యాయ్ కా హక్ మిల్నే తక్” అనే ట్యాగ్‌లైన్‌ను నిర్ణయించామని ఆయన ప్రకటించారు.  మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ముంబై వరకు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’  జరుగుతుందని తెలిపారు.  దేశంలోని 15 రాష్ట్రాల మీదుగా ఇది కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్ర 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తుందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నేను ప్రమాణం చేస్తున్నాను.. : రాహుల్

ఈసందర్భంగా రాహుల్ గాంధీ స్పందిస్తూ..  ‘‘అన్యాయం, అహంకారానికి వ్యతిరేకంగా  న్యాయ నినాదంతో  దేశ ప్రజల మధ్యకు తిరిగి వెళ్తున్నా’’ అని తెలిపారు.  ‘‘నేను ప్రమాణం చేస్తున్నాను.. దేశ ప్రజలకు  న్యాయం లభించే వరకు ఈ యాత్రను కొనసాగిస్తాను’’ అని పేర్కొన్నారు. ఈమేరకు వీడియో సందేశంతో ఆయన ఒక ట్వీట్ చేశారు.

Also Read: Ayodhya – January 22 : జనవరి 22నే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఎందుకు ?

67 రోజుల్లో 6,700 కిలోమీటర్ల యాత్ర

67 రోజుల్లో 6,700 కిలోమీటర్లకుపైగా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్  పార్టీ అధికార ప్రతినిధి ధనంజయ్ ఠాకూర్ తెలిపారు. ఈ యాత్ర ఫిబ్రవరి 16, 17 తేదీల తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు చేరుకుంటుందని, ఐదు రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుందన్నారు. ‘‘ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు సత్యాగ్రహం అనేది బలమైన ఆయుధంగా కాంగ్రెస్ భావిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో జరిగిన అతిపెద్ద సత్యాగ్రహంగా ‘భారత్ జోడో న్యాయ్’ పాదయాత్ర నిలుస్తుంది’’ అని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ యాత్ర ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ కార్యకర్తల మనోధైర్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ రాజకీయాలను సమూలంగా మార్చే యాత్ర

‘‘కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎలాగైతే ప్రభావాన్ని చూపించిందో.. ఇప్పుడు చేయనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా అదేవిధంగా దేశ రాజకీయాలను సమూలంగా  మార్చేస్తుంది’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 90 సభ్యుల అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 54 స్థానాలను గెలుచుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది, 2018లో 68కి తగ్గింది. గోండ్వానా గంతంత్ర పార్టీ ఒకటి గెలుచుకోగలిగింది.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ వలె రాజకీయాలను మార్చే విధంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర నిరూపిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ గతంలో పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Jodo Nyay Yatra
  • congress
  • Kharge
  • rahul gandhi

Related News

Rahul Kerala

Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

  • Pm Modi Hits Back At Rahul

    Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

Latest News

  • IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

  • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd