HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Jaishankar Briefs All Party Meeting On Bangladesh Crisis Rahul Gandhi Raises Questions

All Party Meeting On Bangladesh: జైశంకర్‌ అఖిలపక్ష సమావేశం, రాహుల్ ప్రశ్నలు

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులను జైశంకర్ నేతలకు తెలియజేశారు. బంగ్లాదేశ్ ఆర్మీతో కేంద్ర ప్రభుత్వం టచ్‌లో ఉందని తెలిపారు

  • By Praveen Aluthuru Published Date - 01:07 PM, Tue - 6 August 24
  • daily-hunt
All Party Meeting On Bangladesh
All Party Meeting On Bangladesh

All Party Meeting On Bangladesh: బంగ్లాదేశ్‌లో హింసాత్మక రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా హఠాత్తుగా రాజీనామా చేయడం మరియు దేశం విడిచిపెట్టడం అక్కడ అరాచక పరిస్థితిని సృష్టించింది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన సి-130జె మిలిటరీ విమానంలో హసీనా సోమవారం రాత్రి భారత్‌కు చేరుకుంది. లండన్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. అయితే ఈ రోజు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులను జైశంకర్ నేతలకు తెలియజేశారు. బంగ్లాదేశ్ ఆర్మీతో కేంద్ర ప్రభుత్వం టచ్‌లో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదేనని, సరైన సమయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బంగ్లాదేశ్ లో 20,000 మంది భారతీయ పౌరులు ఉన్నారని పార్టీ సమావేశంలో సమాచారం ఇచ్చారు జైశంకర్. ఇప్పటివరకు 8,000 మంది భారతీయ పౌరులు తిరిగి వచ్చారు. భారత ప్రభుత్వం భారతీయ పౌరులతో టచ్‌లో ఉందని, హైకమిషన్ నిరంతరం పని చేస్తుందని జైశంకర్ సమావేశంలో చెప్పారు. అయితే మైనారిటీలపై దృష్టి సారించాలని, వారికి రక్షణ కల్పించాలని నేతలకు చెప్పినట్లు అఖిలపక్ష సమావేశ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో జైశంకర్ పార్లమెంట్ హౌస్‌లో జరిగిన సమావేశ చిత్రాలను కూడా పంచుకున్నారు. ఈ రోజు పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో బంగ్లాదేశ్‌లో ఇటీవలి పరిణామాల గురించి సమాచారం ఇచ్చారు. ఈ రోజు పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశం వ్యూహం గురించి అడిగారు. అలాగే ఈ సమస్యపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూనే ఉంటామని తెలిపారు.

షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్ అస్థిర రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న నిరసనలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల రూపం దాల్చాయి. కాగా బంగ్లాదేశ్ ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం నాయకులు ప్రతిపాదించారు.

Also Read: Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • all party meeting
  • Bangladesh Protest
  • Jaishankar
  • Parliament Sessions
  • rahul gandhi
  • sheikh hasina

Related News

Let's develop Telangana with Rising 2047: CM Revanth Reddy

CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy : ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ని ప్రశంసిస్తూ, తెలంగాణ, కేరళలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

  • Tarun Chugh

    Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd