HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indian Ships Cross The Strait Of Hormuz

Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధి దాటిన భారత నౌకలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 25-06-2026 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian ships cross the Strait of Hormuz...
Indian ships cross the Strait of Hormuz...

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పరిణామం భారతదేశానికి పెద్ద ఊరటనిచ్చింది. భారత్‌కు వస్తున్న 30 నౌకలు ఇప్పటికే సురక్షితంగా ఈ జలసంధిని దాటాయని, మరో 26 నౌకలు ప్రయాణ అనుమతి కోసం వేచి ఉన్నాయని భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుండి వచ్చే ముడిచమురు, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ), వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం భారతదేశం ప్రధానంగా ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. తాజా పరిణామాలతో దేశంలో ఇంధన భద్రతకు ఉన్న ముప్పు తప్పినట్లయింది.

సముద్రంలో నిలిచిపోయిన నౌకలు

ఇటీవలి ప్రాంతీయ ఘర్షణల కారణంగా ఇరాన్ ఈ జలసంధిపై పట్టు బిగించి, నౌకల రాకపోకలను అడ్డుకోవడంతో వందలాది నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోనే నిలిచిపోయాయి. అయితే, అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం రాకపోకలను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఇంకా వేచి ఉన్న 26 భారతీయ నౌకల్లో 3 నౌకలు ఇంధన లోడుతో, 10 నౌకలు ఎరువులతో, మిగిలిన 13 నౌకలు ఇతర నిత్యావసర వస్తువులతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పటికే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ)కి చెందిన రెండు భారీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించి తమిళనాడులోని ఎన్నూర్, కేరళలోని కొచ్చి టెర్మినల్స్‌కు గ్యాస్ చేరవేశాయి.

ధరలు తగ్గే అవకాశం?

హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా సాఫీగా సాగితే దేశంలో ఇంధన ధరలు స్థిరపడతాయని, ఎరువుల కొరత తీరి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, యుద్ధం ముగిసినప్పటికీ బీమా ఖర్చులు పెరగడం, సముద్రంలో మైన్ల తొలగింపు వంటి సవాళ్లు ఉన్నందున రవాణా పూర్వస్థితికి రావడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం తన నౌకాదళం ద్వారా ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను నిర్వహిస్తూ, భారతీయ నౌకలకు రక్షణ కల్పిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crude oil
  • Strait of Hormuz
  • US Iran Talks

Related News

    Latest News

    • Singer Sunitha: మహిళల డ్రెస్సింగ్ పై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

    • Kapil Dev: క్రికెట్ వరల్డ్ కప్‌ 1983.. 43 ఏళ్ల తర్వాత కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఆ గెలుపు ఎలా సాధ్యమైందంటే…

    • Fatima Sana: పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా స‌నా షాకింగ్ కామెంట్లు.. ప్రాక్టీస్ వదిలేసి మొగుడితో కలిసి డ్రెస్సింగ్ రూంలోనే అలియ రొమాన్స్

    • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధి దాటిన భారత నౌకలు..

    • బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd