Janaushadhi Kendras-Railway Stations : సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు
Janaushadhi Kendras - Railway Stations : భారతీయ జనౌషధి కేంద్రాల పైలట్ ప్రాజెక్టు కోసం సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి.
- By Pasha Published Date - 02:12 PM, Sat - 12 August 23
Janaushadhi Kendras – Railway Stations : భారతీయ జనౌషధి కేంద్రాల పైలట్ ప్రాజెక్టు కోసం సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 50 రైల్వే స్టేషన్లను ఇందుకు ఎంపిక చేశారు.
ఈ రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (పీ.ఎమ్.బీ.జే.కే)ఏర్పాటు చేయనున్నారు.
రోజువారీ రాకపోకలు సాగించే మిలియన్ల కొద్దీ రైలు ప్రయాణికుల ఔషధ అవసరాలను తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
జనౌషధి కేంద్రాలలో సరసమైన ధరలకే మందులను విక్రయించనున్నారు.
Also read : CBN Achievement : చంద్రబాబు తుఫాన్! TDPలోకి బాలినేని?
జనౌషధి కేంద్రాల నిర్వహణకు ఎంపికయ్యే వారికి పీ.ఎమ్.బీ.జే.కే లైసెన్సులను జారీ చేస్తారు. జనౌషధి కేంద్రాల స్టాల్స్ ను ఐఆర్ఈపీఎస్ ద్వారా సంబంధిత రైల్వే డివిజన్లు ఈ-వేలం వేస్తాయి. జనౌషధి స్టాల్స్ ను ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది. ఈ-వేలంలో ఎంపికైన బిడ్డర్లు జనౌషధి కేంద్రాలను నిర్వహించడానికి అవసరమైన అనుమతులు, లైసెన్సులను పొందాలి. ఔషధాల నిల్వ కోసం అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను పొందాలి. జనౌషధి స్కీమ్ కు సంబంధించిన ఒప్పందాన్ని(Janaushadhi Kendras-Railway Stations) కుదుర్చుకోవాలి.
Also read : Chinese Ship: శ్రీలంక చేరిన చైనాకి చెందిన యుద్ధనౌక.. జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్..!
జనౌషధి కేంద్రాలు ఏర్పాటయ్యే రైల్వే స్టేషన్లు ఇవే..
- తిరుపతి – ఆంధ్రప్రదేశ్
- కొత్త టిన్సుకియా – అసోం
- లుమ్డింగ్ – అసోం
- రంగియా – బిహార్
- దర్భంగా – బిహార్
- పాట్నా – బిహార్
- కతిహార్ – బిహార్
- జంజ్గిర్-నైలా – ఛత్తీస్ గఢ్
- బాగ్బహరా – ఛత్తీస్ గఢ్
- ఆనంద్ విహార్ – ఢిల్లీ
- అంకలేశ్వర్ – గుజరాత్
- మహేసన ఇన్ – గుజరాత్
- సినీ జూ – జార్ఖండ్
- శ్రీనగర్ – జమ్ము అండ్ కశ్మీర్
- SMVT బెంగళూరు – కర్ణాటక
- బంగారుపేట – కర్ణాటక
- మైసూర్ – కర్ణాటక
- హుబ్బల్లి Jn – కర్ణాటక
- పాలక్కాడ్ – కేరళ
- పెండ్రా రోడ్ – ఛత్తీస్ గఢ్
- రత్లాం – మధ్య ప్రదేశ్
- మదన్ మహల్ – మధ్య ప్రదేశ్
- బినా – మధ్య ప్రదేశ్
- లోకమాన్య తిలక్ టెర్మినస్ – మహారాష్ట్ర
- మన్మాడ్ – మహారాష్ట్ర
- పింప్రి – మహారాష్ట్ర
- షోలాపూర్ – మహారాష్ట్ర
- నైన్పూర్ – మధ్య ప్రదేశ్
- నాగభీర్ – మహారాష్ట్ర
- మలాద్ – మహారాష్ట్ర
- ఖుర్దా రోడ్ – ఒడిశా
- ఫగ్వారా – పంజాబ్
- రాజపురా – పంజాబ్
- సవాయి మాధోపూర్ – రాజస్థాన్
- భగత్ కీ కోఠీ – రాజస్థాన్
- తిరుచ్చిరాపల్లి – తమిళనాడు
- ఈరోడ్ – తమిళనాడు
- దిండిగల్ జం. – తమిళనాడు
- సికింద్రాబాద్ – తెలంగాణ
- Pt. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జం – ఉత్తర ప్రదేశ్
- విరంగన లక్ష్మీ బాయి – ఉత్తర ప్రదేశ్
- లక్నో – ఉత్తర ప్రదేశ్
- గోరఖ్పూర్ జం – ఉత్తర ప్రదేశ్
- బనారస్ – ఉత్తర ప్రదేశ్
- ఆగ్రా కాంట్ – ఉత్తర ప్రదేశ్
- మధుర – ఉత్తర ప్రదేశ్
- యోగ్ నగరి రిషికేష్ – ఉత్తరాఖండ్
- కాశీపూర్ – ఉత్తరాఖండ్
- మాల్డా టౌన్ – పశ్చిమ బెంగాల్
- ఖరగ్పూర్ – పశ్చిమ బెంగాల్
Tags
Related News
Vande Bharat Express: వందేభారత్పై రాళ్లు విసిరిన బాలుడు.. నెట్టింట విమర్శలు!
వందే భారత్ రైలు (Vande Bharat Express) భారతదేశంలోని ప్రీమియం రైళ్లలో ఒకటి. ఇది దేశంలోని అనేక నగరాల మధ్య నడుస్తుంది.