HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >India Used Suicide Drones Hammer Bombs And Scalp Missiles To Attack Pakistan And Pok

India Attack : పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి.. భారత్ వాడిన ఆయుధాలివే!

భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైకి స్కాల్ప్‌ క్షిపణులను(India Attack) ప్రయోగించారు.

  • By Pasha Published Date - 12:21 PM, Wed - 7 May 25
  • daily-hunt
Operation Sindoor India Attack Pakistan Pok Suicide Drones Kamikaze Drones Hammer Bombs Scalp Missiles Hammer Missiles

India Attack : పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడి చేసింది. భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న నాలుగు ఉగ్రవాద స్థావరాలు, పీఓకేలోని ఐదు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. అత్యంత కచ్చితత్వంతో ఈ ఎటాక్స్ చేశామని భారత సైన్యం ప్రకటించింది. 9 ఉగ్రవాద స్థావరాలపై 25 నిమిషాల  వ్యవధిలో  24 మిస్సైల్ స్ట్రైక్‌లతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ముగిసింది.  ఈ ఆపరేషన్‌లో దాదాపు 90 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.  ఈ దాడి కోసం భారత సైన్యం వినియోగించిన ఆయుధాల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Operation Sindoor : ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ కయ్యానికి దిగితే ఊరుకోం : భారత్

‘ఆపరేషన్ సిందూర్‌‌’లో భారత త్రివిధ దళాల సమన్వయం

పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే క్రమంలో భారత ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బవహల్పూర్‌, మురిద్కేలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. మిగిలిన వాటిని భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడులు జరుగుతున్న క్రమంలో భారత నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో తగిన సహకారాన్ని అందించింది. ఈవిధంగా సమగ్ర సమన్వయంతో ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించారు.

Also Read :India Attack : భారత్ ఎటాక్.. పీఓకేలో 90 మంది ఉగ్రవాదులు హతం?

స్కాల్ప్‌ క్షిపణులు

భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైకి స్కాల్ప్‌ క్షిపణులను(India Attack) ప్రయోగించారు. ఈ మిస్సైళ్లను స్ట్రామ్‌షాడో అని కూడా పిలుస్తారు. వీటిని ఫ్రాన్స్‌ తయారు చేసింది. ఇవి లాంగ్ రేంజ్ క్రూజ్‌ మిసైళ్లు. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే కెపాసిటీ వీటి సొంతం.

హ్యామర్‌ బాంబులు

పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వాయుసేన హ్యామర్ బాంబులు వాడింది. ఇవి చాలా శక్తివంతమైన బాంబులు. బంకర్లను, బహుళ అంతస్తుల భవనాలను కూడా ఇవి ధ్వంసం చేయగలవు.  వీటిని శత్రు లక్ష్యానికి 50-70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించొచ్చు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు బహవల్‌పూర్‌లో మర్కజ్‌ సుబాన్‌ ఉగ్రవాద స్థావరం ఉంది.  ఇది భారత సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ హెడ్‌క్వార్టర్‌ మర్కజ్‌ తైబా  భారత సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటిపై హ్యామర్ బాంబులు వేసినట్లు తెలుస్తోంది.

ఆత్మాహుతి డ్రోన్లు

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత ఆర్మీ ఆత్మాహుతి డ్రోన్లను వాడినట్లు సమాచారం. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని లక్ష్యాలను గుర్తించి, వాటిపై విరుచుకుపడతాయి. తమను తాము పేల్చుకుంటాయి.  ఈవిధంగా పలు ఉగ్రవాద స్థావరాలను భారత్ ఆర్మీ పంపిన సూసైడ్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. వీటి వినియోగం ద్వారా భారత సైన్యం వైపు ప్రాణనష్టాన్ని నివారించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hammer Bombs
  • HAMMER missiles
  • india
  • India Attack
  • Kamikaze Drones
  • Operation Sindoor
  • pakistan
  • POK
  • Scalp Missiles
  • Suicide Drones

Related News

Trade War

Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్‌) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • A new chapter in India's defense system... Negotiations with Russia for the purchase of S-400

    S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd