HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Increasing Complaints About Food Quality In Trains Union Ministrys Response

IRCTC : రైళ్లలో ఆహార నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదులు..కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందన

ఇప్పటివరకు మొత్తం 6,645 ఆహార సంబంధిత ఫిర్యాదులు రైల్వే శాఖకు అందినట్లు వెల్లడించారు. అందులో 1,341 కేసుల్లో సంబంధిత ఫుడ్ సరఫరాదారులపై జరిమానాలు విధించామని, 2,995 కేసుల్లో కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ఇక, మిగిలిన కేసుల్లో, 1,547 ఫిర్యాదులపై సరైన సలహాలు అందించామని, మరో 762 ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు.

  • By Latha Suma Published Date - 12:28 PM, Sat - 26 July 25
  • daily-hunt
Increasing complaints about food quality in trains.. Union Ministry's response
Increasing complaints about food quality in trains.. Union Ministry's response

IRCTC : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందిస్తున్న ఆహార నాణ్యతపై దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భోజనంలో బొద్దింకలు రావడం, పాచిపోయిన ఆహారం అందించడం వంటి సమస్యలు తరచూ వినిపిస్తుండగా, తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు.

2024-25లో 6,645 ఫిర్యాదులు

రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్న వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 6,645 ఆహార సంబంధిత ఫిర్యాదులు రైల్వే శాఖకు అందినట్లు వెల్లడించారు. అందులో 1,341 కేసుల్లో సంబంధిత ఫుడ్ సరఫరాదారులపై జరిమానాలు విధించామని, 2,995 కేసుల్లో కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ఇక, మిగిలిన కేసుల్లో, 1,547 ఫిర్యాదులపై సరైన సలహాలు అందించామని, మరో 762 ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఈ చర్యలు ప్రయాణికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా తీసుకున్నవని స్పష్టం చేశారు.

మునుపటి సంవత్సరాల గణాంకాలు ఇదే దిశగా

ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7,026 ఫిర్యాదులు అందగా, 2022-23లో 4,421 ఫిర్యాదులు, 2021-22లో 1,082 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం ప్రతి ఏడాదీ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఇది రైల్వే భోజన నాణ్యతపై ప్రయాణికుల్లో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా సూచిస్తోంది.

కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకతపై ప్రశ్నలు

ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన మరొక ముఖ్యమైన అంశం కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకతపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు. కాంట్రాక్టులు కేవలం నిబంధనల ప్రకారం మాత్రమే ఇవ్వబడతాయని, వాటిని పున: సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రత్యేకించి కల్తీ లేదా అపరిశుభ్రంగా ఉన్న ఆహారం ఇవ్వడంపై వచ్చే ఫిర్యాదుల విషయంలో, తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. జరిమానాలు విధించడం, కాంట్రాక్టర్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత

రైల్వే శాఖ ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను అత్యంత ప్రాముఖ్యతతో పరిగణించనున్నట్టు తెలిపింది. బాగోలేని ఆహారంపై వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా రైళ్లలో భోజన నాణ్యతపై పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. అయితే, ప్రయాణికులు మరింత సంతృప్తికరమైన సేవలు పొందాలంటే నాణ్యతను బలోపేతం చేయడమే కాకుండా, పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also: Telangana Weather : తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Complaints On Poor Food Quality
  • IRCTC
  • passengers
  • Union Railway Minister Ashwini Vaishnav

Related News

Rail Neer Prices

Rail Neer Prices: రైలు ప్రయాణికులకు శుభవార్త.. రైల్ నీర్ ధరలు తగ్గింపు!

రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు జీఎస్‌టీ (GST) తగ్గింపు ప్రయోజనాలను నేరుగా అందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd