HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Household Consumption Expenditure Survey Report On The Rice Consumption In Indian States

Rice Consumption : ఆ రాష్ట్రాల ప్రజలు నెలకు కేజీ బియ్యం కూడా తినరట.. తెలుగు స్టేట్స్ ఎక్కడ ?

సాధారణ తరహా గోధుమల(Rice Consumption) రేటు ప్రస్తుతం రూ.30కిపైనే ఉంది.

  • By Pasha Published Date - 08:33 AM, Mon - 3 February 25
  • daily-hunt
Rice Consumption In Indian States Hces Survey Report Household Consumption Milk Vegetables

Rice Consumption : మనదేశంలోని ఒక్కో రాష్ట్రం ప్రజలకు ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు ప్రధాన ఆహారంగా ఉంటే, ఇంకొన్ని రాష్ట్రాల్లో బియ్యం ప్రధాన ఆహారం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రజల నెలవారీ తలసరి బియ్యం వినియోగం ఒక కేజీ కూడా ఉండదట. . ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయం సర్వే: 2023-24’ నివేదికలో ప్రస్తావించారు. అక్కడి ప్రజలు ప్రధాన ఆహార వనరుగా గోధుమలను వినియోగిస్తున్నారు. రోజూ మూడు పూటలా చపాతీలే తినడానికి వాళ్లు ప్రయారిటీ ఇస్తారు.  పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో గోధుమ సాగు ఎక్కువ. దీనివల్ల అక్కడ అది తక్కువ రేటుకే లభిస్తుంది.

Also Read :100 Years For Electric Train : మన తొలి విద్యుత్‌ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ

తెలుగు రాష్ట్రాల్లో..

  • బియ్యం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మన దేశంలో 9వ స్థానంలో ఉంది. తెలంగాణలోని ప్రజల నెలవారీ తలసరి బియ్యం వినియోగం 8.4215 కేజీలు.
  • ఏపీ ప్రజల నెలవారీ తలసరి బియ్యం వినియోగం  7.9185 కేజీలు.  ఈవిషయంలో ఏపీ మన దేశంలో 12వ స్థానంలో ఉంది.
  • దక్షిణాదిలో బియ్యం వినియోగం ఎక్కువగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లోనే.
  • ఏపీలో కిలో బియ్యానికి ప్రజలు సగటున రూ.29 ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రజలు రూ.31 దాకా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో గుర్తించారు.
  • ప్రజల తలసరి బియ్యం వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు 14వ స్థానంలో, కేరళ 18వ స్థానంలో, కర్ణాటక 20వ స్థానంలో ఉంది.
  • దక్షిణాదిలోని కేరళ, కర్ణాటకలలో గోధుమలు, జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
  • బియ్యం వినియోగంలో నంబర్ 1 స్థానంలో మణి‌పూర్, నంబర్ 2 స్థానంలో త్రిపుర, నంబర్ 3 స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి.
  • మొత్తం మీద మన దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే  ప్రధాన ఆహార వనరు.

Also Read :ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్‌-02’ శాటిలైట్‌

సాధారణ తరహా బియ్యం రేటు ప్రస్తుతం సగటున రూ.45కుపైనే ఉంది. సాధారణ తరహా గోధుమల(Rice Consumption) రేటు ప్రస్తుతం రూ.30కిపైనే ఉంది. మొత్తం మీద బియ్యమే ఎక్కువ ధరతో వస్తుంది. గోధుమలను కొన్న తర్వాత వాటిని పిండిగా మార్చుకోవడానికి ఇంకొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ధరతో సంబంధం లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వారివారి సాంప్రదాయక ఆహారపు అలవాట్ల ప్రకారం బియ్యం తిన్నాలా ? గోధుమలు తినాలా ? అనేది డిసైడ్ చేసుకుంటారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HCES Survey Report
  • Household Consumption Survey
  • Indian States
  • milk
  • Rice consumption
  • Vegetables

Related News

Meal Maker

Veg Protein Food : వెజ్‌లో నాన్‌వెజ్ ప్రోటీన్స్.. ఇంతకూ అదేం కర్రీనో తెలుసుకోండి

Veg protein food : మిల్ మేకర్ అనేది సోయా గింజల నుండి తయారయ్యే ఒక శాకాహార ప్రోటీన్ ఉత్పత్తి. ఇది చూడటానికి చిన్నగా, గుండ్రంగా ఉంటుంది. మన దేశంలో దీనిని సోయా చంక్స్, సోయా వడియాలు అని కూడా పిలుస్తారు.

    Latest News

    • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

    • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

    • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

    • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd