HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Hold Special Sessions In Parliament Rahul Letter To The Prime Minister

Pahalgam Incident : పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి..ప్రధానికి రాహుల్‌ లేఖ

"పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి" అని రాహుల్‌ పేర్కొన్నారు.

  • By Latha Suma Published Date - 11:57 AM, Tue - 29 April 25
  • daily-hunt
Hold special sessions in Parliament.. Rahul letter to the Prime Minister
Hold special sessions in Parliament.. Rahul letter to the Prime Minister

Pahalgam Incident : జమ్ముకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి ఘ‌టన‌ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్న విష‌యం తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌ వైఖ‌రిని అధికార పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షాలు కూడా ఖండిస్తున్నాయి. అయితే ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, ప్ర‌ధాని మోడీకి మంగళవారం లేఖ రాశారు. “పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి” అని రాహుల్‌ పేర్కొన్నారు.

ఇక, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఖర్గే సైతం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏప్రిల్ 22న పహల్గాం ఘటన లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్‌ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే తన లేఖలో ప్రస్తావించారు.

Read Also: Rohit Basfore : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు అనుమానాస్పద మృతి

కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్ ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాల నుంచి డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం దాడిని ఖండిస్తూ తీర్మానం చేయడం ద్వారా దేశం మొత్తం ఐక్యంగా ఉందనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని స్వతంత్ర ఎంపీ కపిల్‌ సిబల్‌ సూచించారు. ఈవిషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

కాగా, జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Read Also: Pahalgam Terror Attack : పాక్‌కు ఎగుమతి చేసే ఔషధాల వివరాలను వెంటనే పంపండి: కేంద్ర ప్రభుత్వం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mallikarjun kharge
  • Pahalgam Incident
  • Pahalgam Terror Attack
  • Parliament Special sessions
  • pm modi
  • rahul gandhi

Related News

Rare Earths Scheme

Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

భారతదేశంలో ఈ అయస్కాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025తో పోలిస్తే 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశ అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారా తీర్చబడుతున్నాయి.

  • Virat Kohli

    Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

  • Ram Temple

    Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

  • Indian Girl

    Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

  • Modi Speech

    PM Modi At G20 Summit: జీ20 సదస్సులో తన మార్క్ చూపించిన ప్రధాని మోదీ

Latest News

  • Group-2 Rankers : 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

  • Home Decor : పగలకొట్టకుండానే చిప్ప నుంచి కొబ్బరి తీసే చిట్కా, కూరగాయల్ని కూడా నిమిషాల్లో కట్ చేయొచ్చు..!

  • Shocking Incident in Russia : వామ్మో రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే చనిపోయాడు

  • Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డే విచారణ

  • AP Mock Assembly Held on Constitution Day : పిల్లల సభ అదిరింది.. పెద్దల తీరు మారాలి!

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd