Arvind Kejriwal: గుజరాత్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
- By Gopichand Published Date - 02:54 PM, Thu - 3 November 22
ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన కొద్ది నిమిషాలకే తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 95 స్థానాల్లో విజయం సాధిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదని అన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు.
“నేను మీ సోదరుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిని. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు ఉచిత విద్యుత్ ఇస్తాను. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తానని’’ ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్లో విజయం సాధించిన తర్వాత ఉత్సాహంగా ఉన్న కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన బీజేపీకి భంగపాటు కావాలని ఆశిస్తున్నారు. “మేము ఇప్పుడు 90-95 సీట్లు (182 సీట్లలో) గెలుస్తాం. ఇదే వేగం కొనసాగితే 140 నుండి 150 సీట్లు గెలుస్తాము” అని AAP ప్రధాన ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.
aap పార్టీ ఈసారి మొత్తం 182 నియోజకవర్గాలకు అభ్యర్థులను పోటీకి దింపుతోంది. 2017లో దాదాపు 30 స్థానాల్లో పోటీ చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కేజ్రీవాల్ గత కొన్ని నెలలుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి గుజరాత్లో అనేక పర్యటనలు చేశారు. 2017లో తన ఓట్ల శాతాన్ని పెంచుకున్న కాంగ్రెస్ ఎన్నికలు త్రిముఖ పోటీ కాదని చెబుతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 182 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడత నోటిఫికేషన్ నవంబర్ 5 , పోలింగ్ డిసెంబర్ 1న, రెండో విడత నోటిఫికేషన్ నవంబర్ 10న పోలింగ్ డిసెంబర్ 5న నిర్వహిస్తామని అన్నారు. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
Related News
Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ పుంజుకోకపోతే ఆప్ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత దశాబ్దంలో ఎన్నో అడ్డంకులను అధిగమించారు.