Shocking : మహాశివరాత్రి వేళ.. శివలింగాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు
Shocking : మహాశివరాత్రి పండుగ ఉత్సాహంతో దేశం మొత్తం కళకళలాడుతుండగా, గుజరాత్లోని ద్వారక జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. సముద్రతీరానికి సమీపంలో ఉన్న పురాతన శివాలయం నుంచి శివలింగం దొంగిలించబడింది!
- Author : Kavya Krishna
Date : 26-02-2025 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
Shocking : మహాశివరాత్రి పండుగ సంతోషంతో దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొన్న సమయంలో, గుజరాత్ రాష్ట్రం ద్వారక జిల్లాలోని సముద్రతీరానికి సమీపంలో ఉన్న పురాతన శివాలయానికి సంబంధించిన ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ద్వారక జిల్లా లోని కళ్యాణ్పూర్లో ఉన్న శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివలింగం దొంగిలించబడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మహాశివరాత్రి ఒక రోజు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేచింది. అవసరమైన ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వచ్చిన పూజారి ఆలయం తలుపు తెరిచినప్పుడు ఈ విషయాన్ని గమనించాడు. అయితే, ఆలయంలోకి ప్రవేశించినప్పుడు గర్భగుడి నుంచి శివలింగం దొంగిలించబడిన విషయం తెలిసింది.
Sukesh Offer : ఎలాన్ మస్క్కు ఆర్థిక నేరగాడు సుఖేశ్ బంపర్ ఆఫర్
ఈ ఘటనతో వెంటనే పూజారులు పోలీసులను సమాచారమిచ్చారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కోసం అనేక ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్థానిక క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫోరెన్సిక్ నిపుణులతో పాటు డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటున్నారు. ఈ దొంగతనంపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టి, శివలింగం ప్రాప్యాన్ని సత్వరమే సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దొంగతనం శివాలయాల భద్రతపై అనేక ప్రశ్నలను సృష్టిస్తోంది.
సముద్రతీరంలో ఉన్న పాత ఆలయంలో ఇది జరిగినప్పుడు, ఆ ప్రాంతంలో సెక్యూరిటీ పరిస్థితులు కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజలు, హిందూ ధర్మాభిమానులు వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే.. సముద్ర తీరంలో ఈ ఆలయం ఉండటంతో దుండగులు సముద్ర నీటిలో శివలింగాన్ని పడేసుంటారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్కూబా డైవర్లతో సముద్రం నీటిలో శివలింగం కోసం గాలంపు చర్యలు కొనసాగుతున్నాయి.
Urvashi Rautela: ఊర్వశి రౌతేలాకి ఊహించని అనుభవం.. అభిమాని ప్రవర్తనకు షాక్ అయినా నటి!