HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Gujarat Man Dies After Car Hits Bike And Drags Him For 12 Km

Car Hits Bike: దారుణ ఘటన.. కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు..!

ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలాగే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. జనవరి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు (Car Hits Bike) ఢీకొట్టింది.

  • Author : Gopi Date : 25-01-2023 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
accident
Resizeimagesize (1280 X 720) 11zon

ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలాగే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. జనవరి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు (Car Hits Bike) ఢీకొట్టింది. దీంతో కారు కింద భాగంలో చిక్కుకున్న సాగర్‌ను 12 కి.మీ లాక్కెళ్లడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

గుజరాత్‌లోని సూరత్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులను ఓ కారు డ్రైవర్‌ ఢీకొట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత బైక్‌పై నుంచి కిందపడి భార్యకు గాయాలయ్యాయి. కాగా 12 కిలోమీటర్ల దూరంలో భర్త మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఢీకొన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. జనవరి 18న సూరత్‌లోని పల్సానా తహసీల్‌లో బైక్ రైడర్ జంటను కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ సమయంలో భార్య అక్కడే పడిపోయింది. ఆమె భర్త మృతదేహం 12 కిలోమీటర్ల దూరంలో కనుగొనబడింది. ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన వీడియో పోలీసులకు అందింది. దాని ఆధారంగా పోలీసులు కారును ట్రేస్ చేయగలిగారు. ఘటనానంతరం నిందితుడు కారు యజమాని పరారీలో ఉన్నాడు.

జనవరి 18వ తేదీ రాత్రి అశ్వని, సాగర్ ఇద్దరూ బైక్‌పై బంధువుల ఇంటి నుంచి ఇంటికి వస్తున్నారు. పల్సానా తహసీల్ తాటితయ్య గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అశ్వని బైక్‌పై నుంచి కిందపడింది. కాగా ఢీకొన్న తర్వాత సాగర్‌ అక్కడ కనిపించలేదు. ఈ విషయాన్ని ప్రజలు అశ్వని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కొద్దిసేపటికి బంధువులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ సాగర్ ఆచూకీ లభించలేదు. చికిత్స నిమిత్తం అశ్వని ఆస్పత్రికి తరలించారు. దీని తర్వాత సాగర్ అన్వేషణ ప్రారంభమైంది. సంఘటనా స్థలంలో సాగర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: Today Gold And Silver Rate: ప‌సిడి ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. పెరిగిన బంగారం ధ‌ర‌లు..!

మరోవైపు.. కమ్రేజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్మాడి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే సాగర్ మిస్సింగ్ ఫిర్యాదు పల్సానా పోలీస్ స్టేషన్‌లో ధృవీకరించబడింది. ఆ తర్వాత మృతదేహం సాగర్‌ పాటిల్‌దేనని తెలిసింది. ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో సాగర్ మృతదేహం లభ్యమైంది. ఈ హిట్ అండ్ రన్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. సూరత్ పోలీసులకు ఓ వీడియో అందిందని, అందులో కారు వేగంగా వెళుతున్నట్లు గుర్తించామని డీఎస్పీ హితేష్ జోయిసర్ తెలిపారు. దీని తర్వాత వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని సంప్రదించగా, అతను తన కారులో వెళుతున్నానని, కోస్మాడి గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న కారు నుండి ఒక వ్యక్తి మృతదేహం పడిపోయిందని చెప్పాడు. విషయం తీవ్రతను గ్రహించి కారును వెంబడించి వీడియో తీశాడు.

వీడియో ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా.. అసలు విషయం బయటపడింది. ప్రమాదానికి కారణమైన కారు సూరత్‌కు చెందిన వీరేన్ అహిర్‌కు చెందినదని పోలీసులు చెబుతున్నారు. ఆర్టీఓ, ఇతర నిఘా ఆధారంగా పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని పరారీలో ఉన్నాడు. ఈ కేసులో పోస్టుమార్టం ఆధారంగా ఈడ్చుకెళ్లడం వల్లే సాగర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ హితేష్ జోయిసర్ తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Car Drags Man
  • Car Hits Bike
  • crime news
  • Delhi Road Accident
  • gujarat
  • Gujarat Road Accident

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Major twist in the Pune murder case: It is reported that Siya Agarwal committed the murder because she didn't like it.

    Ketan Agarwal: కేతన్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు

Latest News

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd