Freebies Disaster: ఎన్నికల్లో ఉచిత వాగ్ధానాలపై `సుప్రీం` కీలక నిర్ణయం
ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత వాగ్దానాలను వ్యతిరేకిస్తూ వేసిన `పిల్` కు నరేంద్ర మోడీ సర్కార్ మద్ధతు పలికింది.
- By CS Rao Published Date - 06:45 PM, Wed - 3 August 22
ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత వాగ్దానాలను వ్యతిరేకిస్తూ వేసిన `పిల్` కు నరేంద్ర మోడీ సర్కార్ మద్ధతు పలికింది. ఉచిత పథకాల కారణంగా దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని అభిప్రాయపడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉచిత పథకాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వేసిన దాఖలైన పిల్ కు సుప్రీం కోర్టు వేదికగా కేంద్ర ప్రభుత్వం మద్ధతు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, ప్రజాకర్షక వాగ్దానాలు “ఓటరు నిర్ణయాన్ని వక్రీకరిస్తాయి” అని ప్రధాన న్యాయమూర్తి N.V. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అఫిడవిట్ సమర్పించారు. న్యాయవాది, బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిల్ కు కేంద్ర ప్రభుత్వం మద్ధతు పలకడం గమనార్హం.
`ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్నాం. భారత ఎన్నికల సంఘం (EC) దయచేసి ఏదైనా చేయండి, ”అని మెహతా బెంచ్ ని కోరారు. EC ఇప్పటికే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పోల్ ప్యానెల్ జోక్యం చేసుకోదని పేర్కొంది. ఉచితాల విధానం ఆర్థికంగా లాభదాయకంగా ఉందా లేదా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా అనేది ఎన్నికల సమయంలో ఓటర్లు నిర్ణయించవచ్చని పేర్కొంది. ఈ అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలు వినిపించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత వాగ్ధానాలపై తుది నిర్ణయం తీసుకోవాలని CJI చెప్పారు. EC పునః పరిశీలించనివ్వండి అంటూ సొలిసిటర్ జనరల్ చెప్పారు. “పిటిషనర్ వాదనకు” ప్రభుత్వం మద్దతునిచ్చిందని మెహతా వెల్లడించారు. NITI ఆయోగ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఫైనాన్స్ కమిషన్, లా కమిషన్, EC అలాగే రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు వంటి వివిధ సంస్థల సభ్యులతో కూడిన ఒక ఉన్నత-స్థాయి ప్యానెల్ను ఏర్పాటు చేయాలని CJI ప్రతిపాదించారు.
Related News
Supreme Court : ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు ఫై వేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్ట్
ఈ పిటిషన్ లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు తెలిపింది.