HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >First Calm Night Along Line Of Control In Recent Days Indian Army

Indian Army : ఆగిన కాల్పులు.. 19 రోజుల తర్వాత ఎల్‌ఓసీ వద్ద ప్రశాంతత

ఒకవేళ కాల్పులు జరిపితే.. భారత్ భీకర దాడులకు దిగే ముప్పు ఉందనే విషయాన్ని పాక్(Indian Army)  గ్రహించింది.

  • By Pasha Published Date - 09:15 AM, Mon - 12 May 25
  • daily-hunt
Line Of Control First Calm Night Indian Army India Pakistan

Indian Army : ఏప్రిల్ 22 తర్వాత తొలిసారిగా ఆదివారం రాత్రి భారత్‌-పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు కానీ, షెల్లింగ్‌ కానీ జరగలేదు. 19 రోజుల తర్వాత ఆదివారం రాత్రి ప్రశాంతంగా గడిచిందని భారత ఆర్మీ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో కాల్పుల మోత వినిపించలేదని వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల వెంట రాత్రి ప్రశాంతంగా గడిచిందని పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపితే.. ఫిరంగి షెల్స్‌తో బలమైన సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశించారు. చిన్న కవ్వింపునకు కూడా బలమైన సమాధానం ఇవ్వాలని నిర్దేశించారు. సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇవన్నీ తెలుసుకున్న పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపేందుకు సాహసించలేదు. ఒకవేళ కాల్పులు జరిపితే.. భారత్ భీకర దాడులకు దిగే ముప్పు ఉందనే విషయాన్ని పాక్(Indian Army)  గ్రహించింది. ఇదే పరిస్థితిని పాక్ కొనసాగిస్తే బెటర్. లేదంటే భారత సైన్యం తడాఖా చూపించే అవకాశం లభిస్తుంది.

Also Read :Tibet Earthquake : టిబెట్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు

పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో రైళ్లు 

‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ తర్వాత మే 10న సాయంత్రం భారత్‌-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీన్ని ఒకవేళ పాకిస్తాన్ పాటించకుంటే.. తీవ్రంగా ప్రతిఘటిస్తామని ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22వ తేదీ తర్వాతి  నుంచి సరిహద్దుల్లో పాకిస్తాన్ భీకర కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా బలంగా ప్రతిఘటించింది. సరిహద్దు గ్రామాలు లక్ష్యంగా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో దాదాపు 15 మందికిపైగా సామాన్య భారత ప్రజలు చనిపోయారు.  వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇకపై ఇలాంటి ఆగడాలను చూస్తూ ఊరుకునేది లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Also Read :Laden Vs Nuclear Weapons : లాడెన్‌‌తో పాక్ అణు శాస్త్రవేత్తకు లింకులు.. అతడి పుత్రరత్నానికి పెద్ద పోస్ట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • First Calm Night
  • india
  • Indian army
  • Line of Control
  • pakistan

Related News

Gold Price Aug20

Gold : RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

Gold : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకోవడం దేశ ఆర్థిక వ్యూహంలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావించబడుతోంది.

  • S 400

    ‘S-400’ : రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు

  • Shaheen Afridi

    Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

  • Afghanistan-Pakistan War

    Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

Latest News

  • Rice Bran Oil: గుండె స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే.. ఈ నూనె వాడాల్సిందే!

  • Virginity: వర్జినిటీ కోల్పోవ‌డానికి స‌రైన వ‌య‌స్సు ఉందా?

  • Vitamin D: విటమిన్ డి గ్రహించడాన్ని అడ్డుకునే ఆహారాలు ఇవే?!

  • Relationship Tips: మీ భాగ‌స్వామిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? అయితే దూరం అవుతున్న‌ట్లే!

  • AUS Beat IND: అడిలైడ్‌ వన్డేలో భారత్ ఘోర ఓట‌మి.. సిరీస్ ఆసీస్ కైవ‌సం!

Trending News

    • 8th Pay Commission: ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్ప‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం!

    • YS Jagan: బాల‌కృష్ణ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో ఇదే!

    • HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్

    • ATM Rules: ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే ఇక‌పై రూ. 23 క‌ట్టాల్సిందే!

    • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd