HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Farmers Reject Centres Proposal To Continue Delhi March From Wednesday

Farmers Vs Govt : రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. 21 ఢిల్లీలోకి ప్రవేశిస్తామన్న రైతు సంఘాలు

Farmers Vs Govt : ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు  కొంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.

  • By Pasha Published Date - 07:49 AM, Tue - 20 February 24
  • daily-hunt
Delhi Chalo
Farmers Vs Govt

Farmers Vs Govt : ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు  కొంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అది తమకు సమ్మతం కాదని స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రి రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌ మధ్య చర్చలు జరిగాయి. ఆ సందర్భంగా కేంద్ర సర్కారు చేసిన ప్రపోజల్స్‌పై సోమవారం సాయంత్రం చర్చించిన రైతు సంఘాల నేతలు వాటికి నో చెప్పారు. కేవలం మూడు పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని రైతులు తప్పుపట్టారు.  కేంద్రం ప్రతిపాదనలు  రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవని చెప్పారు. రైతు సంఘాల నేతలందరి మధ్య చర్చలు జరిగిన తర్వాతే కేంద్ర సర్కారు ప్రతిపాదనను తిరస్కరించాలని నిర్ణయించినట్లు రైతు నేత జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ మీడియాకు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

కేంద్ర సర్కారుతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోకి ప్రవేశించి శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ వెల్లడించారు. ‘‘కేంద్ర సర్కారు వీలైతే  మా డిమాండ్లను నెరవేర్చాలి. లేదంటే ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలి’’ అని ఆయన కోరారు. ఈ నెల 23న ఢిల్లీకి మార్చ్‌ నిర్వహిస్తామని నోయిడా, గ్రేటర్‌ నొయిడా రైతులు వెల్లడించారు. భూసేకరణకు అధిక పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింత కోరుతూ ఈ మార్చ్‌(Farmers Vs Govt) నిర్వహించనున్నామని తెలిపారు.

Also Read : Summer: ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం.. ఎండలతో జనాల ఇబ్బందులు

పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు కోరుతూ గత వారం రైతు సంఘాలు ఢిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలను ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా  ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ రైతులు వారం రోజులుగా సరిహద్దుల్లోనే ఉంటున్నారు.

Also Read : Putin Found Love: 39 ఏళ్ల మ‌హిళ‌తో ప్రేమ‌లో ప‌డిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Centres Proposal
  • Delhi March
  • farmers protest
  • Farmers Reject
  • Farmers Vs Govt

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd