Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Ex Envoy To Pakistan Reveals Chilling Details Of 2008 Mumbai Attacks Aftermath

9/11 Report: ముంబై పేలుళ్లపై వెలుగులోకి సంచలన విషయాలు.. అలా చేశారంటూ?

26/11 ముంబై బాంబు పేలుడ ఘటన గురించి వినగానే ప్రతి భారతీయుడు గుండెల్లో గుబులు రేగుతోంది.

  • By Nakshatra Published Date - 08:45 AM, Sat - 30 July 22
9/11 Report: ముంబై పేలుళ్లపై వెలుగులోకి సంచలన విషయాలు.. అలా చేశారంటూ?

26/11 ముంబై బాంబు పేలుడ ఘటన గురించి వినగానే ప్రతి భారతీయుడు గుండెల్లో గుబులు రేగుతోంది. 2008లో ముంబైలో ఉగ్ర మూకలు జరిపిన విధ్వంసం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరువలేని ఓ చీకటి అధ్యాయం అని చెప్పవచ్చు. ఈ ఉగ్రదాడి భారతీయులకు ఎప్పటికీ గుర్తు ఉంటంది. ఈ ఘటన జరిగి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు అయినా సరే.. లష్కరే ఈ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయిూద్ పై పాకిస్తాన్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ దాడి అతడు చేయించినట్లు ఆధారాలు ఉన్నా కూడా దాయాది పాక్ ఇప్పటికీ అతడిపై చర్యలు తీసుకోలేదు.

అయితే ఈ ఘటన గురించి ఇస్తామాబాద్ లో అప్పుడు భారత రాయబారిగా ఉన్న శరత్ సబర్వాల్ తాజాగా తన పుస్తకంలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ముంబై దాడులు జరిగిన రెండేళ్లలోపే సయిూద్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా తాను పాక్ ఆర్మీని కోరానని, కానీ అతడిపై ఎలాంటి ఆధారాలు లేనందును చర్యలు తీసుకోలేదని పాక్ ఆర్మీ తెలిపినట్లు శరత్ సబర్వాల్ తన పుస్తకం ఇండియాస్ పాకిస్తాన్ కాన్ డ్రమ్ లో తెలిపాడు. ముంబైలో మూడు రోజుల పాటు జరిగిన ఈ మారణహోమంపై ఇండియాతో పాటు ఇతర దేశాలు పాక్ తో సాక్ష్యాలు పంచుకున్నాయన్నారు. లష్కరే తోయిబాకు చెందిన 10 మంది సభ్యులు కరాచీ నుంచి నౌక ద్వారా ముంబైలోకి చొరబడ్డారని తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ దాడుల్లో హఫీజ్ సయిూద్ పాత్ర గురించి కసబ్ తెలిపిన వివరాలతో పాటు ఇతర ఆధారాలు లభించాయన్నారు.

ఆగస్టు 2010లో పాకిస్తాన్ కు చెందిన ఓ సీనియర్ ఆర్మీ అధికారితో జరిగిన సంభాషణను తన పుస్తకంలో సబర్వాల్ రాశారు. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ చెప్పిన నాలుగు పాయింట్లను పొందపర్చారు. ముంబై ఉగ్రదాడికి సైన్యం లేదా ISI నాయకత్వం ఇవ్వలేదని పాక్ ఆర్మీ ఆఫీసర్ చెప్పాడట. ఇక ఇండియా వేగంగా డెవలప్ అవుతున్న క్రమంలో ఇలాంటి చర్యలు భారత పురోగతిని ఆపలేవని, పాక్ ప్రజలకు మెరుగైన ఆర్థిక, ఆరోగ్యం, విద్యా సౌకర్యాలను కల్పించడానికి సహాయం చేయవని ఆర్మీ అధికారులు భావించారట. ముంబై దాడుల్లో నేరస్థులను పట్టుకోవడానికి పాక్ ఆర్మీ సహాయం చేసిందని, కానీ హఫీజ్ సయిూద్ పై ఎలాంటి ఆధారాలు లేనందున చర్యలు తీసుకోలేదని పాక్ ఆర్మీ అధికారి చెప్పినట్లు సబర్వాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. తన అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం గురించి పాక్ ఆందోళన కలిగి ఉందని, వాటిని పరిష్కరించాలని కోరుకుంటుందని పాక్ ఆర్మీ ఆఫీసర్ చెప్పినట్లు సబర్వాల్ పుస్తకంలో తెలిపాడు.

Tags  

  • 2008 mumbai terror attacks
  • ajmal kasab
  • hafiz saeed
  • Indias Pakistan Conundrum book
  • ISI Pakistan
  • lashkar e taiba
  • sharat sabharwal
  • zakiur rehman lakhvi

Related News

    Latest News

    • India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

    • Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్

    • CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం

    • Fake Tweets: కేశినేని పేరుతో ట్వీట్ల కలకలం…తనవి కావన్న కేశినేని నాని..!!

    • Roja Fire : మామూలు యాంకర్లే కారు కొంటున్నారు…నేను కొంటే తప్పేంటీ..?

    Trending

      • AP Pvt Medical Colleges: ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులుం

      • Sausage Star: కొత్త నక్షత్రం అంటూ ఫోటో షేర్ చేసిన శాస్త్రవెత్త.. తీరా అదేంటని చూస్తే?

      • Aadhar Card: కార్డులో ఇలా ఈజీగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోండి.. పూర్తి వివరాలివే!

      • Friendship Day: ఫ్రెండ్ షిప్ డేను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

      • Mosquitoes Issue: వర్షాకాలంలో ఈగలు, దోమల బాధపడలేకపోతున్నారా..అయితే శాశ్వతంగా తరిమేసే చిట్కాలివిగో..

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: