HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Election Strategist Prashat Kishore Sugegstions To Congress Party

Prashant Kishor : కాంగ్రెస్‌కు పీకే కీల‌క సూచ‌న‌లు.. అలా చేయ‌క‌పోతే క‌ష్ట‌మే..

అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వడానికి నానా క‌ష్టాలూ ప‌డుతోంది.

  • By Hashtag U Published Date - 11:28 AM, Sun - 17 April 22
  • daily-hunt

అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వడానికి నానా క‌ష్టాలూ ప‌డుతోంది. ఇప్ప‌టికే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం చ‌విచూడ‌టంతో త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై క‌న్నేసింది. ఇందులో భాగంగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిశోర్ సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, ఆ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) మధ్య శనివారం చర్చించిన కీలక అంశాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ లో చేరి నాయకుడిగా పనిచేయాలని పీకేను సోనియాగాంధీ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరొచ్చని తెలిపాయి.

ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణతో కూడిన ఒక నివేదికను పీకే సమర్పించారు. లోక్ సభ ఎన్నికల ముందు పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులను సూచించారు. ముఖ్యంగా సమాచార సంబంధాల విభాగాన్ని పూర్తిగా సంస్కరించాలన్నది ఆయన సూచన. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెట్టాలని కోరారు. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు.

‘‘ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదన అందించారు. పార్టీ నేతల బృందం దీన్ని చూస్తుంది. ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించేది పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు’’అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ముఖ్యంగా 370 లోక్ సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాని.. మిగిలిన స్థానాల్లో పొత్తులతో వెళ్లొచ్చని పీకే సూచించారు. యూపీ, బీహార్, ఒడిశాలో ఒంటరిగా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో పొత్తులతో వెళ్లొచ్చన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • PCC Chief revanth reddy
  • prashant kishore
  • sonia gandhi

Related News

    Latest News

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd