Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!
ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం ఈ పరిశీలకులను నియమించింది. వీరి ప్రధాన బాధ్యత ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుండి ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థుల ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించడం, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించడం.
- By Gopichand Published Date - 03:50 PM, Sun - 28 September 25

Election Commission: భారత ఎన్నికల సంఘం (Election Commission) బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025, కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఉపఎన్నికల కోసం 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించింది. వీరి జాబితాను కూడా విడుదల చేసింది. అక్టోబర్-నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా అక్టోబర్లో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశాలో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. దీని కోసం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 470 మంది అధికారులను కేంద్ర పరిశీలకులుగా నియమించారు. వీరిలో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్/ఐసీఏఎస్ అధికారులు ఉన్నారు.
ఏయే స్థానాలకు ఎన్నికలు/ఉపఎన్నికలు?
ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్-నవంబర్ 2025లో బీహార్ అసెంబ్లీలోని 225 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అదే సమయంలో కింది స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
Also Read: CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- గుజరాత్ (కడీ, విసావదర్)
- కేరళ (ఒక సీటు)
- పంజాబ్ (లుధియానా వెస్ట్)
- పశ్చిమ బెంగాల్ (కాళిగంజ్)
- ఉత్తరప్రదేశ్ (గోండా జిల్లాలోని కట్రా బజార్ – ఎమ్మెల్యే బావన్ సింగ్ మరణం కారణంగా ఖాళీ అయినప్పటికీ, తేదీ ఇంకా ప్రకటించలేదు).
- అలాగే రాజ్యసభ ఉపఎన్నికలు కూడా జరగనున్నాయి. జమ్మూకశ్మీర్ (4), పంజాబ్ (1), ఆంధ్రప్రదేశ్ (3), ఒడిశా, హర్యానా, పశ్చిమ బెంగాల్ (ఒక్కొక్కటి) స్థానాలకు రాజ్యసభ ఉపఎన్నికలు జరగనున్నాయి.
పరిశీలకుల బాధ్యతలు ఏమిటి?
ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం ఈ పరిశీలకులను నియమించింది. వీరి ప్రధాన బాధ్యత ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుండి ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థుల ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించడం, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించడం. ఎన్నికలు నిష్పక్షపాతంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా జరిగేలా చూడటం కూడా వీరి విధి. పరిశీలకులు తమ బాధ్యతను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఈసీ ఆదేశించింది. ఏదైనా ఫిర్యాదు వస్తే దానికి పరిశీలకులే బాధ్యత వహిస్తారని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.