EC: ఓటర్లకు ఈసీ కీలక సూచనలు
- By Latha Suma Published Date - 06:05 PM, Tue - 26 March 24

EC key points: వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది (Heatwave Warning). మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్వేవ్ నేపథ్యంలో ఓటర్లకు కీలక సూచనలు చేసింది (Poll Panel Issues Advisory).
We’re now on WhatsApp. Click to Join.
లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించననుంది. ఈ ఎన్నికల సమయంలోనే ఎండలు కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈసీ ఓటర్ల (Voters)కు పలు సూచనలు చేసింది.