HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Dk Shivakumar Puts An End To Karnataka Cm Speculation

DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్

వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్‌కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

  • Author : Latha Suma Date : 21-11-2025 - 6:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
DK Shivakumar puts an end to Karnataka CM speculation
DK Shivakumar puts an end to Karnataka CM speculation

Karnataka : కర్ణాటక రాజకీయాలలో గత కొన్ని వారాలుగా నెలకొన్న ముఖ్యమంత్రి మార్పు చర్చలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఐదేళ్ల పాటు సిద్ధరామయ్య (Siddaramaiah)నే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఈ వ్యవధిలో తన సంపూర్ణ సహకారం ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్‌కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శాసనసభలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉండటంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ నాయకత్వాన్ని కలిసి తమ అభిప్రాయాలు తెలియజేయడం సహజమని శివకుమార్ అభిప్రాయపడ్డారు. మంత్రిపదవి కోసం ప్రయత్నించడం తప్పేమీ కాదని, ఆ ప్రక్రియలో తన పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగతప్రయోజనాల కోసం, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఢిల్లీకి వెళ్లడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు.

RGV : రాజమౌళికి ఆర్‌జీవీ అండ.. విమర్శల వెనుక అసలు కారణం అదేనంటా ?

కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే ఏ బాధ్యతనైనా స్వీకరించే సామర్థ్యం కలిగిన వారేనని ఆయన నొక్కిచెప్పారు. సిద్ధరామయ్య ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్వయంగా వెల్లడించారని, ఆ నిర్ణయానికి తానూ పూర్తి మద్దతు ఇస్తున్నానని శివకుమార్ తెలిపారు. “మేం అందరం కలిసి పనిచేస్తాం. ప్రభుత్వాన్ని బలపరచడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో నేతృత్వ మార్పు చర్చలు కొంతవరకు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య రెండున్నరేళ్లు పూర్తి చేసుకోవడంతో డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలన్న కోరిక ఆయన వర్గంలో బలంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లటం రాజకీయ సమీకరణాలను వేడెక్కించింది. ముఖ్యంగా శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఈరోజు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాయకత్వ మార్పు చర్చలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సుర్జేవాలా పూర్తిగా తోసిపుచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి బీజేపీ ప్రచారం జరుపుతోందని ఆయన ఆరోపించారు.

GST : జీఎస్టీ తగ్గించినా ధరలు తగ్గకపొవడానికి కారణాలివే..!

సిద్ధరామయ్య, శివకుమార్‌లతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలియజేసిన సుర్జేవాలా, ముఖ్యమంత్రి మార్పు గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడరాదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ నేతృత్వ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని, ఖర్గే మరియు గాంధీ కుటుంబం చెప్తే అదే అనుసరించాలని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. డీకే శివకుమార్ కూడా అధిష్ఠానం మాటే శిరోధార్యమని పలుమార్లు చెప్పారు. ఇప్పటికే ప్రధానమంత్రి మార్పు చర్చలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని చుట్టుపక్కల వర్గాలు సూచిస్తున్న సమయంలో, సిద్ధరామయ్య స్వయంగా ఖర్గేకు ఫోన్ చేసి ఈ విషయాన్ని వివరించారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ, ఈ వివాదానికి ముగింపు పలికే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత ఉద్రిక్తతలకు కొంత ఉపశమనం కలిగించినట్టు కనిపిస్తోంది. మొత్తం మీద, నేతృత్వ మార్పు చర్చలకు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ సాధారణ స్థితికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • DK Shivakumar
  • karnataka cm
  • karnataka politics
  • Mallikarjuna Kharge
  • siddaramaiah

Related News

CM Revanth Reddy

CM Revanth Meets Sonia Gandhi : సోనియాగాంధీతో సీఎం రేవంత్ చర్చించిన అంశాలు ఇవే !!

CM Revanth Meets Sonia Gandhi : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో కీలక భేటీ అయ్యారు

    Latest News

    • Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    • Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

    • IndiGo Flight Disruptions : ఇండిగో ప్యాసింజర్లకు రూ.10 వేల విలువైన వోచర్లు

    • AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

    • Akhanda 2 : ‘అఖండ-2’ కు మరో దెబ్బ..బాలయ్య కు ఎవరి దిష్టి తగిలిందో..?

    Trending News

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

      • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd