HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Delhi Cracks Down On Old Vehicles Warning With Heavy Fines

ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు.

  • Author : Latha Suma Date : 18-12-2025 - 12:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi cracks down on old vehicles... warning with heavy fines
Delhi cracks down on old vehicles... warning with heavy fines

. కాలుష్య నియంత్రణ కోసం కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు
. బార్డర్ నుంచే పాత వాహనాలను వెనక్కి పంపిస్తున్న వైనం
. కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందంటున్న వాహనదారులు

Traffic police restrictions : దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే కాకుండా నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత ప్రాంతాల్లోనూ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీఎస్-4 మరియు అంతకన్నా ఉన్నత ప్రమాణాలు కలిగిన వాహనాలకే ఢిల్లీలో ప్రవేశం కల్పిస్తున్నారు. బీఎస్-3 ప్రమాణాలు లేదా అంతకన్నా తక్కువగా ఉన్న కార్లు, ఇతర వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదు.

ఈ నిబంధనలు అతిక్రమించి పాత వాహనాలతో నగరంలోకి రావడానికి ప్రయత్నిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా బీఎస్-3 కార్లతో పట్టుబడితే రూ.20 వేల వరకు ఫైన్ వేస్తామని అధికారులు స్పష్టం చేశారు. చెక్ పోస్టుల వద్దే పాత వాహనాలు గుర్తిస్తే వెంటనే వెనక్కి మళ్లించాలని ఆదేశిస్తున్నారు. జరిమానా తప్పించుకోవాలంటే సరిహద్దు నుంచే తిరిగి వెళ్లిపోవాల్సిందేనని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. ఢిల్లీలో నివసించే పాత వాహనాల యజమానులకూ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణకు సహకరించకుండా రోడ్లపైకి వస్తే రూ.20 వేల జరిమానా తప్పదని తేల్చిచెప్పారు. నగరం నలుమూలలా ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ల వల్ల తప్పించుకునే అవకాశమే లేదని అధికారులు అంటున్నారు.

అయితే ఈ తనిఖీలతో ఢిల్లీతో పాటు ఫరీదాబాద్, గురుగ్రామ్ వంటి పరిసర ప్రాంతాల వాహనదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాలుష్య నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనలపై సరైన అవగాహన లేకుండా పాత కారుతో ఢిల్లీకి వచ్చిన ఫరీదాబాద్ వాసి ఒకరు స్పందిస్తూ, ట్రాఫిక్ పోలీసులు కార్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారని అన్నారు.

తాము రోడ్ ట్యాక్స్‌తో పాటు ఇతర అన్ని పన్నులు చెల్లించామని ఆయన గుర్తుచేశారు. ప్రైవేట్ కార్లపైనే చర్యలు తీసుకుంటున్న పోలీసులు ప్రజా రవాణా వ్యవస్థ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే బస్సులను తనిఖీ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు అందరికీ సమానంగా ఉండాలని, ఒక్క వర్గాన్నే ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఢిల్లీలో కాలుష్య నియంత్రణ పేరుతో అమలవుతున్న తాజా ఆంక్షలు వాహనదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండగా, ప్రజలు మాత్రం సరైన ప్రణాళిక లేకుండా తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BS3 vehicles
  • BS4 vehicles
  • delhi
  • Delhi Traffic Police
  • Faridabad
  • Pollution Control
  • traffic rules
  • Vehicle check posts
  • Vehicle fine

Related News

Bill Gates 

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Bill Gates   ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • IND vs NAM

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd