Honey Trapping : ఢిల్లీలో దంపతుల హనీ ట్రాప్… వ్యాపారవేత్తను బెదిరించి రూ.80లక్షలు దోపిడీ
- By Prasad Published Date - 08:55 AM, Sun - 27 November 22
హనీట్రాప్ చేసి ఓ వ్యాపారవేత్త దగ్గర దంపతులు డబ్బు దోచుకున్న ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. తప్పుడు అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి వ్యాపారవేత్త నుంచి రూ.80 లక్షలకు పైగా దోపిడీ చేసినందుకు ఢిల్లీలోని యూట్యూబర్ జంటపై కేసు నమోదైంది. గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్లో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని నడుపుతున్న ఓ వ్యక్తిని యూట్యూబర్ జంట హనీట్రాప్ చేశారు. సోహ్నాలోని ఒక హోటల్లో కొన్ని నెలల క్రితం పని గురించి మాట్లాడటానికి ఢిల్లీలోని షాలిమార్ బాగ్లో నివసించే నమ్రా ఖాదిర్ అనే మహిళతో సంప్రదించినట్లు బాధితుడు తెలిపాడు. నమ్రా ఖాదిర్తో పాటు విరాట్ అలియాస్ మనీష్ బెనివాల్ అనే మరో వ్యక్తి కూడా వచ్చినట్లు బాధితుడు తెలిపారు.అలా పరిచయమైన తరువాత రోజుల్లో నమ్రా ఖదీర్తో రాత్రులు గడిపాడని.. పక్కన వచ్చిన మనీష్ బెనివాల్ అనే వ్యక్తి తాము కలిసి ఉన్న సమయంలో వీడియోలు తీశాడని బాధితుడు తెలిపాడు. దీని ఆధారంగా ఆ ఇద్దరు తనను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని తెలిపాడు. అనంతరం నమ్రా ఖాదిర్ తనపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించి తన వద్ద నుంచి రూ.80 లక్షలు తీసుకున్నాడని బాధితుడు వాపోయాడు.
Related News
Rahil – Another Case : ఆ కేసులోనూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే నిందితుడు !
Rahil - Another Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.