HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Coaching Center Incident Delhi Lieutenant Governor Meet The Students

Delhi LG : కోచింగ్‌ సెంటర్‌ ఘటన..విద్యార్థులను కలిసిన ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌

ఈ సందర్భంగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఓల్డ్ రాజిందర్ నగర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ.. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • By Latha Suma Published Date - 02:52 PM, Mon - 29 July 24
  • daily-hunt
111
Coaching center incident..Delhi lieutenant governor meet the students

Delhi LG : దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్ర నగర్‌లో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌(Civils Coaching Centre) బేస్‌మెంట్‌లోకి వరదనీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా(Delhi Lieutenant Governor VK Saxena) కలిశారు. సోమవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్‌ వద్దకు వెళ్లిన ఎల్జీ.. అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ ప్రమాదంపై స్పందించిన ఢిల్లీ ఎల్జీ.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు ఆమోదించదగినవి కాదన్నారు. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కవర్ చేసి జూలై 30లోగా నివేదిక సమర్పించాలని డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్‌ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్‌(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్‌ దల్వైన్‌(29) వరదనీటిలో మునిగి మరణించారు.

Read Also: Bihar: ఇంజిన్ నుంచి విడిపోయిన 19 బోగీలు, తప్పిన భారీ ప్రమాదం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Coaching center incident
  • delhi
  • Lieutenant Governor VK Saxena

Related News

Air Pollution Vizag

Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం

Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు

  • Cm Revanth Delhi Today

    CM Revanth Reddy to Visit Delhi : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

  • Delhi Air Pollution

    Delhi Air Pollution: వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు..నగరం వదిలివెళ్లాల్సిందే !!

Latest News

  • Storm Damage : తుఫాను నష్టంపై అమిత్ షాకు లోకేష్ నివేదిక అందజేత

  • National Herald Case : సోనియా, రాహుల్ లపై కేసులు పెడితే భయపడేది లేదు – రేవంత్

  • Imran Khan: ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు?

  • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

  • Karnataka CM Post : హైకమాండ్ ఎప్పుడు చెపితే అప్పుడు డీకే సీఎం అవుతాడు – సిద్దరామయ్య

Trending News

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd