HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Centres Sensational Decision On Petrol 30 Excise Duty Waiver

Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

  • Author : Vamsi Chowdary Korata Date : 11-06-2026 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Centre's sensational decision on petrol 30% excise duty waiver.
Centre's sensational decision on petrol 30% excise duty waiver.

పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం మినహాయించింది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్‌ ఉన్న పెట్రోల్‌పై ఈ మినహాయింపు వర్తించనుంది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన రకాలపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో దేశంలో అధిక శాతం ఇథనాల్‌ ఉన్న ఇంధనాల వినియోగానికి ఊతం లభించే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్‌ మిశ్రమాలకు కొత్త నాణ్యత ప్రమాణాలను బీఐఎస్‌ ప్రకటించింది. ఇథనాల్‌ శాతం, ఆక్టేన్‌ రేటింగ్‌, సల్ఫర్‌ పరిమితులు, భద్రతా నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు పన్ను మినహాయింపు కూడా రావడంతో అధిక ఇథనాల్‌ మిశ్రమాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక మద్దతు లభించినట్లైంది.

దేశంలో ఇథనాల్‌ మిశ్రమాల కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. 2018లో తీసుకొచ్చిన జాతీయ బయోఫ్యూయల్‌ విధానాన్ని 2022లో సవరించిన కేంద్రం 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025-26కు ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ సంస్థలు 2022 జూన్‌లోనే 10 శాతం మిశ్రమ లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఆ తర్వాత ఇథనాల్‌ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇథనాల్‌ మిశ్రమాలపై గతంలో కొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మైలేజ్‌, ఇంజిన్‌ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ20 ఇంధనం వల్ల భద్రతాపరమైన సమస్యలు లేవని వాహన తయారీ సంస్థల సంఘం స్పష్టం చేసింది. పూర్తి అధ్యయనం తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం కూడా తెలిపింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • Clean Energy
  • Ethanol Petrol
  • Excise Duty Cut India
  • National Biofuel Policy

Related News

LPG Price

LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 4కు పరిమితం చేస్తున్నట్లు సోమవారం ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పేద కుటుంబాల సగటు వాడకానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016 మ

    Latest News

    • Donald Trump: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

    • GOLD: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధరలు

    • Cholesterol: కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమే.. అయితే అది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది?

    • Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

    • Weather Report: నైరుతి ఎఫెక్ట్.. తెలంగాణకు వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd