UP: జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో మంటలు…17 మంది ప్రయాణికులు..!!
- By hashtagu Published Date - 08:55 AM, Mon - 14 November 22
జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులో నుంచి బయటకు దూకారు. ఈ ఘటన ఇటావాలోని భారతియా కోఠీ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమణించిన ప్రయాణికులు బస్సులోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరంతా నేపాల్ నివాసితులుగా గుర్తించారు. బస్సు జైపూర్ ుంచి నేపాల్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైంది. షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం వెల్లడించారు. ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా నేపాల్ కుచెందిన కూలీలుగా గుర్తించారు.U
Related News
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు