Mock Drills : బాంబు బెదిరింపులు..రాజధానిలోని పలు ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్
- By Latha Suma Published Date - 02:03 PM, Sat - 4 May 24
Mock Drills: ఢిల్లీ పోలీసులు(Delhi Police) నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)తో కలిసి IGI విమానాశ్రయం, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ మరియు DPS RK పురం వద్ద శుక్రవారం అర్థరాత్రి మరియు శనివారం తెల్లవారుజామున భద్రతా మాక్ డ్రిల్లు(Mock Drills) నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల(Bomb threats) నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్ను నిర్హహించారు. ఢిల్లీలో దాదాపు 200 పాఠశాలలకు బూటకపు బాంబు బెదిరింపులు వచ్చియి.
We’re now on WhatsApp. Click to Join.
#WATCH | Delhi: Delhi Police and NSG conducted a mock drill late last night, at Hyderabad House. pic.twitter.com/KX9v8A4JjB
— ANI (@ANI) May 4, 2024
శుక్రవారం రాత్రి 10 గంటలకు ఐజీఐ విమానాశ్రయంలో ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు డ్రిల్ నిర్వహించారు.డ్రిల్లో భాగంగా, విమానాశ్రయ భద్రతను చూసే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మాక్ టెర్రర్ దాడి గురించి అప్రమత్తమైంది. అగ్నిమాపక శాఖ మరియు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) వంటి ఇతర ఏజెన్సీలు కూడా డ్రిల్లో చేరాయి. ఇది కనీసం అరగంట పాటు కొనసాగిందని ఒక అధికారి తెలిపారు.
Read Also: T20 World Cup: టీమిండియాకు పట్టిన శని అంపైర్ మళ్లీ వచ్చేశాడు
కాగా, డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఐజిఐ) మీడియాతో మాట్లాడుతూ.. “భయపడాల్సిన అవసరం లేదు. ఇది టెర్రర్ ఎటాక్ మాక్ డ్రిల్ వ్యాయామం..ఇది ఇతర ఏజెన్సీలతో సమన్వయంతో నిర్వహించబడుతోంది. అన్ని పేర్కొన్నారు. ” రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో తెల్లవారుజామున 1 గంటలకు, హైదరాబాద్ హౌస్లో 1.30 గంటలకు, ఆర్కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెల్లవారుజామున 3 గంటలకు ఇదే విధమైన కసరత్తు జరిగింది.
Related News
Kanhaiya Kumar: పూలమాల వేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థిపై చెప్పుతో దాడి
కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్పై శుక్రవారం ఇద్దరు యువకులు దాడి చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కన్హయ్య కుమార్ను ఈ యువకులు చెప్పుతో కొట్టారు. అయితే అక్కడే ఉన్న కన్హయ్య మద్దతుదారులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.