LK Advani : ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.
- By Pasha Published Date - 07:39 AM, Thu - 27 June 24

LK Advani : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని పాత ప్రైవేట్ వార్డులో చేర్పించారు. అద్వానీ(LK Advani) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపాయి. 96ఏళ్ల అద్వానీకి ఢిల్లీ ఎయిమ్స్లోని యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. అద్వానీ మెడికల్ బులెటిన్ను కాసేపట్లో విడుదల చేయనున్నారు. అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా అద్వానీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆయన ఆరోగ్యంపై ఆరాతీశారు. అద్వానీకి మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ వైద్యులకు నిర్దేశించారు.
We’re now on WhatsApp. Click to Join
- దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే ఎల్కే అద్వానీ స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించారు. అద్వానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన నివాసానికి వెళ్లి భారతరత్నను ప్రదానం చేశారు.
- 1965 ఫిబ్రవరి 25న కమల అద్వానీని అద్వానీ వివాహం చేసుకున్నారు.
- 2016 ఏప్రిల్ 6న కమల అద్వానీ కన్నుమూశారు.
- ఎల్కే అద్వానీకి ఒక కుమార్తె ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు.
- అద్వానీ కొడుకు, కూతురు ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
- ఎల్కే అద్వానీ 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు.
- కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ స్కూలులో అద్వానీ తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.
- 1947 సెప్టెంబర్ 12న అద్వానీ కుటుంబం పాకిస్థాన్ను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చింది.
- ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి అద్వానీ న్యాయ పట్టా అందుకున్నారు.