Manoj Tiwari: 51 ఏళ్ల వయసులో తండ్రైన బీజేపీ ఎంపీ..!
భోజ్పురి నటుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ (Manoj Tiwari) 51 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రయ్యారు. నిన్న ఆయన (Manoj Tiwari) భార్య సురభి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి
- Author : Gopichand
Date : 13-12-2022 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
భోజ్పురి నటుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ (Manoj Tiwari) 51 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రయ్యారు. నిన్న ఆయన (Manoj Tiwari) భార్య సురభి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దానికి ‘లక్ష్మి తరువాత, సరస్వతి నా ఇంటికి వచ్చింది, మీరందరూ ఆశీర్వదించాలి’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా మనోజ్ తివారీకి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి మరో కూతురు పుట్టింది. ఆయన భార్య సురభి తివారీ డిసెంబర్ 12న ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను మనోజ్ తివారీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మనోజ్ తివారీ తన భార్యతో ఆసుపత్రి నుండి తీసిన మొదటి చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడం ద్వారా తండ్రి అవుతున్న వార్తను అందించాడు. కూతురు రాకపై సంతోషం వ్యక్తం చేస్తూ ఓ క్యూట్ పోస్ట్ కూడా పెట్టాడు. నటుడు 51 సంవత్సరాల వయస్సులో ఒక కుమార్తెకు తండ్రి అయినందుకు ఉద్వేగభరితంగా కనిపించాడు.
Also Read: CM Nitish Kumar : బీహార్లో మద్యపాన నిషేధం కొనసాగుతుంది – సీఎం నితీశ్ కుమార్
సోషల్ మీడియాలో ఇలా రాశాడు. “లక్ష్మి తర్వాత సరస్వతి నా ఇంటికి వచ్చిందని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంట్లో ఒక అందమైన కుమార్తె జన్మించింది. మీరందరూ ఆమెను ఆశీర్వదించాలి” అంటూ ఆయన రాసుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ తివారీకి సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పంజాబీ గాయకుడు మికా సింగ్తో సహా భోజ్పురి సినీ ప్రముఖులు కూడా నటుడిని అభినందిస్తున్నారు.