BBC Effect : BBCపై మోడీ సర్కార్ వార్! మీడియాలో `విదేశీ` నీలినీడలు!
మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులకు డోర్లను బార్లా తెరిచిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు బీబీసీ(BBC Effect)
- By CS Rao Published Date - 12:39 PM, Fri - 17 February 23
మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులకు డోర్లను బార్లా తెరిచిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు బీబీసీ(BBC Effect) రూపంలో ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా బీబీసీ చేస్తోన్న రిపోర్టింగ్(Reporting) మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి భారత దేశానికి వస్తే వేర్పాటువాదులకు మద్ధతు పలుకుతూ తొలి నుంచి రిపోర్టింగ్ చేస్తుందనే ముద్ర ఉంది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారత దేశం విడిపోయిన తరువాత ఏర్పడిన పాకిస్టాన్ కు సానుభూతి కలిగేలా రిపోర్టింగ్ చేస్తుంటుందని ఆరోపణలను ఎదుర్కొంటోంది.
మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులకు డోర్లను బార్లా తెరిచిన మోడీ ప్రభుత్వం (BBC Effect)
పాకిస్తాన్, చైనాకు అనుకూలంగా బీబీసీ రిపోర్టింగ్ (Reporting)ఉంటుందని బీజేపీ చెబుతోంది. పలు సందర్భాల్లో ఆ మీడియా సంస్థ వ్యవహరించిన తీరును బయటపెడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబాయ్ బీబీసీ కార్యాలయం మీద భారత్ ఐటీ అధికారులు దాడులను కొనసాగిస్తున్నారు. పలు కంప్యూటర్లు, ఉద్యోగుల మొబైల్స్, ఇతరత్రా లావాదేవీలను పరిశీలిస్తోంది. వాటిలోని డేటాను అధ్యయనం చేస్తోంది. ఇదంతా గోద్రా అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంట్రీని ప్రసారం చేయడం కారణంగా మోడీ సర్కార్ చేస్తోన్న దాడిగా బీబీసీ భావిస్తోంది. ఆ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో పోరాడేందుకు సిద్ధమైయింది. అత్యంత అవినీతితో కూడిన విషపూరిత రిపోర్టింగ్ ను బీబీసీ అందిస్తోందని బీజేపీ అగ్రనేతలు సైతం(BBC Effect) ఫైర్ అవుతున్నారు. ఆయా సందర్భాల్లో భారత్ మీద వ్యతిరేకంగా బీబీసీ ప్రసారం చేసిన న్యూస్, ఇతరత్రా ప్రోగ్రామ్ లను మోడీ సర్కార్ బయటకు తీస్తోంది.
వామపక్ష-ఉదారవాద పక్షపాతం బీబీసీ రిపోర్టింగ్ లో(Reporting)
వామపక్ష-ఉదారవాద పక్షపాతం బీబీసీ రిపోర్టింగ్ లో(Reporting) కనిపిస్తుంటుందని బీజేపీ చెబుతోంది. పక్షపాత రిపోర్టింగ్ పై ఇటీవల టెలిగ్రాఫ్ విశ్లేషణ చేసింది. పలు దేశాల్లోని వేర్పాటువాద ఉద్యమాలను బీబీసీ సున్నితత్వంతో (BBC Effect)గమనించింది. కానీ, భారతదేశం విషయంలో విభిన్నంగా వ్యవహరించింది. కాశ్మీర్ మరియు పంజాబ్లో (ఖలిస్తాన్ కోసం) పాకిస్తాన్ మద్దతు ఉన్న వేర్పాటువాద ఉద్యమాల కవరేజీలో బీబీసీ వేర్పాటువాదం గురించి నిలదీయకుండా దాటవేసింది. పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో కూడా వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది, అయితే బీబీసీ మాత్రం అక్కడి వేర్పాటువాదుల పట్ల సానుభూతి చూపలేదు. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉయ్ఘర్ ముస్లింలకు ఏమి జరుగుతుందో మరొక ఉదాహరణ.
కాశ్మీర్ భారత భూభాగం కాదనే భావాన్ని బీబీసీ ఫోకస్(BBC Effect)
బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన తరువాత పాకిస్తాన్ ఏర్పడింది. అప్పట్లో కాశ్మీర్తో సహా రాచరిక రాష్ట్రాలు ఇష్టానుసారంగా నిర్ణయించుకోవడానికి అనుమతి పొందాయి. రెండు దేశాలలో దేనితోనైనా విలీనం లేదా స్వతంత్రంగా ఉండేలా చేసింది. కాశ్మీర్ పాలకుడుపై పాకిస్తాన్ దాడి చేసినప్పుడు భారతదేశం సహాయం కోరాడు. సైన్యాన్ని పంపే ముందు కాశ్మీర్ మహారాజును సంతకం చేయమని భారత్ కోరింది. ఎందుకంటే సైన్ ఇన్స్ట్రుమెంట్పై సంతకం చేయకుండా సైన్యాన్ని పంపడం దురాక్రమణ చర్య. కానీ, కాశ్మీర్ ను భారత-పరిపాలన ప్రాంతంగా చూస్తూ భారత భూభాగం కాదనే భావాన్ని బీబీసీ ఫోకస్(BBC Effect) చేసింది. అలాగే, చైనా స్వాధీనం చేసుకున్న మరియు విలీనం చేసిన టిబెట్ గురించి బీబీసీ అభిప్రాయం భిన్నంగా ఉంటుంది. స్కాట్లాండ్లో విచ్చలవిడి వేర్పాటువాద ఉద్యమాలు జరిగాయి. అయితే స్కాట్లాండ్ UK-నిర్వహణలో ఉన్న ప్రాంతం కాదనే భావన బీబీసీకి ఉంది.
Also Read : BBC Letter to Employees: ఉద్యోగులకు బీబీసీ తాజా లేఖ..!
2008లో ముంబయిలో జరిగిన దాడులను పాకిస్థాన్కు చెందిన తీవ్రవాద సంస్థలు అమలు చేశాయని సర్వత్రా తెలిసిందే. కానీ, బీబీసీ దాడి చేసిన వారిని ఉగ్రవాదులు కాదని ముష్కరులుగా (BBC Effect)పేర్కొంటూనే ఉంది. ఇది ఉత్తర ఐర్లాండ్లోని తిరుగుబాటులో ఉపయోగించిన దానికంటే భిన్నమైన కోణంలో భారతదేశంలోని సాయుధ తిరుగుబాటులను చూస్తోంది. నల్లజాతి ప్రజలు అనుభవించే జాత్యహంకారం, వివక్ష , అసమానతలను హైలైట్ చేయడానికి బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం కవరేజీపై(Reporting) బీబీసీకి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇజ్రాయెల్-పాలస్తీనియన్ వివాదంపై అసంపూర్ణంగా , తప్పుదోవ పట్టించేలా బీబీసీ రిపోర్టింగ్ గుర్తించబడింది. పాలస్తీనియన్ల కష్టాలను తగినంతగా నివేదించడంలో విఫలమైంది. అదే సమయంలోగాజా నుండి పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపులను బీబీసీ కీర్తిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. కాశ్మీర్లో భద్రతా దళాలపై దాడి చేసి చంపే వారు తరచుగా బీబీసీకి టచ్ లో ఉంటారని అనుమానం ఉంది.
బ్రిటన్ లోనూ బీబీసీ పలుమార్లు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత
బ్రిటన్ లోనూ బీబీసీ పలుమార్లు ప్రభుత్వం నుంచి వ్యతిరేకతను (BBC Effect) చవిచూసింది. పలు సందర్భాల్లో దేశాన్ని పక్కదోవ పెట్టించేలా రిపోర్టింగ్ చేసిందన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వాలను కూల్చేసిన సందర్భాలు ఉన్నాయని బీబీసీ చరిత్ర చెబుతోంది. ఆనాడున్న ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి కూడా బీబీసీని భారత్ నుంచి రెండుసార్లు బహిష్కరించడానికి కారణాలు లేకపోలేదు. కలకత్తా, ఫాంటమ్ ఇండియా అనే రెండు డాక్యుమెంటరీలను అప్పట్లో బీబీసీ ప్రసారం (Reporting)చేసింది. అందుకు ఆగ్రహించిన ఇందిరాగాంధీ 1975లో మొదటి బహిష్కరణ వేటు వేశారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో బీబీసీని రెండోసారి మళ్లీ బహిష్కరించారు. అప్పటి ఢిల్లీ బీబీసీ కరస్పాండెంట్ మార్క్ టుల్లీ భారతదేశం వదిలి వెళ్ళడానికి 24 గంటల ఇచ్చారు. సెన్సార్షిప్ ఒప్పందంపై సంతకం చేయడానికి బీబీసీ నిరాకరించిన తర్వాత ఇది జరిగింది. స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలో రెండు సార్లు బీబీసీని భారత్ నుంచి బహిష్కరించిన చరిత్ర ఉంది.
Also Read : BBC Office: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు.. ‘సోదాలు కాదు.. సర్వేనే’
ఇదే సందర్భంలో బీబీసీ చరిత్రను గమనిస్తే బ్రిటీష్ ప్రభుత్వం మీద యుద్ధం (BBC Effect) చేసిన అంశాలను గమనించవచ్చు. ఫాక్ ల్యాండ్స్ యుద్ధం 1982లో జరిగింది. ఆ సమయంలో యూకే ప్రధాన మంత్రిగా ఉన్న మార్గరెట్ థాచర్ , కన్జర్వేటివ్ ఎంపీలు బీబీసీ గురించి పలు ఆరోపణలు చేశారు. బ్రిటీష్ దళాలను తమ దళాలుగా పిలవడానికి బీబీసీ నిరాకరించిన అంశాన్ని దుయ్యబట్టారు. దీంతో బీబీసీని స్వాధీనం చేసుకోవాలనుకున్న మార్గరేట్ విజయవంతం కాలేదు. ఇటీవల బ్రెక్సిట్ కోసం ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న సమయంలో అందుకు వ్యతిరేకంగా బీబీసీ రిపోర్టింగ్ చేసింది. ఆ మేరకు బ్రిటీష్ పార్లమెంటేరియన్ల బృందం బీబీసీ లేఖ కూడా పంపింది. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగాలని 2016లో ఓటింగ్ జరిగిన సమయంలోనూ వ్యతిరేకంగా రిపోర్టింగ్(Reporting) చేసింది. పార్లమెంట్, పార్లమెంటేరియన్ల నుంచి బీబీసీ పలుమార్లు వ్యతిరేకతను చవిచూసింది.
బ్రాడ్కాస్టింగ్ నియమాలను ఉల్లంఘించినందుకు తరచుగా బీబీసీని ..
గత ఏడాది 97,156 ఫిర్యాదులను బీబీసీ అందుకుంది. బ్రాడ్కాస్టింగ్ నియమాలను పదేపదే ఉల్లంఘించినందుకు తరచుగా బీబీసీని(BBC Effect) ఆఫ్ కామ్ ర్యాప్ చేసింది. ఆఫ్ కామ్ యునైటెడ్ కింగ్డమ్ ప్రసార, టెలికమ్యూనికేషన్స్ మరియు పోస్టల్ పరిశ్రమల కోసం ప్రభుత్వం ఆమోదించిన నియంత్రణ సంస్థ. వాణిజ్య సంస్థలు కూడా బీబీసీతో పోటీపడే సామర్థాన్ని పరిమితం చేస్తున్నాయనే ఫిర్యాదు ఉంది. ఇలాంటి చరిత్ర ఉన్న బీబీసీ మీద మోడీ సర్కార్ యుద్ధాన్ని చేస్తుందని చెప్పుకోవచ్చు. బ్రిటీష్ ప్రభుత్వాలను పడగొట్టిన బీబీసీ భారత్ లోని మోడీ సర్కార్ ను ఏమి చేస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Related News
Hyderabad: హైదరాబాద్లోని చట్నీస్ హోటల్పై ఐటీ దాడులు
చట్నీస్ కు ఐటీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని పలు చట్నీస్ హోటల్స్, మేఘనా ఫుడ్స్ వంటి ప్రముఖ ఆహార సంస్థలను లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారు.