Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద కుంభకోణం : అరవింద్ కేజ్రీవాల్
కేంద్రంలో ప్రభుత్వం మారి దర్యాప్తు చేపడితే ఆయుష్మాన్ భారత్ పథకంలో జరిగిన భారీ అవినీతి గురించి ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
- By Latha Suma Published Date - 08:41 PM, Fri - 17 January 25

Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని దేశంలోనే కుంభకోణం అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది నకిలీ స్కామ్ అని సుప్రీంకోర్టు ధృవీకరించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం మారి దర్యాప్తు చేపడితే ఆయుష్మాన్ భారత్ పథకంలో జరిగిన భారీ అవినీతి గురించి ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభీమ్)ను ఢిల్లీలో అమలు చేయడానికి జనవరి 5 లోగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేయాలని డిసెంబర్ 24న ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆప్ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఆయుష్మాన్ భారత్ అమలు కోసం ఒప్పందం చేసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కేంద్రం, ఇతరుల స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది.
కాగా, గత ఏడాది డిసెంబర్ 24న జారీ చేసిన ఆదేశాలలో, ఢిల్లీ నివాసితులు దాని కింద ఉన్న నిధులు మరియు సౌకర్యాలను కోల్పోకుండా చూసేందుకు PM-ABHIMని పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వుపై ఆప్ డిస్పెన్సేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Read Also: Sunil : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం