Delhi: దేశ రాజధానిలో దారుణం… 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య!!
దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. నరేలా ప్రాంతంలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు.
- By hashtagu Published Date - 12:32 PM, Sat - 8 October 22
దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. నరేలా ప్రాంతంలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఇంటిముందు ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికకు చాక్లెట్ ఇప్పిస్తామంటూ ఆశ చూపి…కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో బాలిక తలపై రాయితో కొట్టి హత్య చేశారు. ఈఘటనపై ఆగ్రహించిన స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు ఔట్ పోస్ట్ దగ్గర బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కాగా బాలికకు తండ్రి లేడు. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. బాలిక తల్లి స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాలికపై అత్యాచారం జరిగిన విషయం స్థానికులకు బంధువులకు తెలిసింది. కాగా ఈ ప్రాంతంలో యధేచ్చగా డ్రగ్స్ విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
Related News
Amit Shah Fake Video: ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపిన సీఎం రేవంత్ రెడ్డి
లోకసభ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపడం రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుంది. సీఎం స్థాయి వ్యక్తి ఎలాంటి నేరారోపణలు లేకుండా ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులు పంపారు. కాగా తాజాగా రేవంత్ ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు. వివరాలలోకి వెళితే..