HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shah Press Meet At Hyderabad

Amit Shah : మేం రాగానే.. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం

మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.

  • Author : Kavya Krishna Date : 11-05-2024 - 5:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah (1)
Amit Shah (1)

మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ… గతంలో బీఆర్‌ఎస్‌ అప్పులు చేసినట్లే కాంగ్రెస్‌ కూడా చేస్తోందని ఆరోపించారు. ఈ పదేళ్లలో తెలంగాణకు లక్షల కోట్ల నిధులు ఇచ్చామని అమిత్‌ షా అన్నారు. ఓవైపు ఇండి కూటమి.. రెండోవైపు ఎన్డీయే కూటమి అని, ఓవైపు 12 లక్షల కోట్ల అవినీతికి కూటమి.. మరోవైపు 25 పైసల అవినీతి కూడా లేని మోదీ కూటమి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార అహంకారం తలకెక్కిన ఇండికూటమి.. 23 ఏళ్లుగా.. సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకునే మోదీ కూటమి అని ఆయన అన్నారు. ఈ పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆర్ధిక వ్యవస్థ, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, స్టార్టప్ వంటివాటిలో గణనీయమైన ప్రగతిని సాధించామని, 20సార్లు లాంచ్ చేసినా.. రాహుల్ లాంచింగ్ ను కాంగ్రెస్ విజయవంతంగా చేపట్టలేకపోతోందని అమిత్‌షా అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

21వసారి కూడా అదే విఫలప్రయత్నం దిశగా వారు పనిచేస్తున్నారని అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. 2014లో తెలంగాణలో రెవెన్యూ సర్ ప్లస్ ఉన్నదని, కానీ ఈ పదేళ్లలో రాష్ట్రప్రభుత్వాల తీరుతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ.15వేల కోట్లు లభిస్తే.. ఇవాళ ఒక్క తెలంగాణకే రూ.60వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. మౌలికవసతులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులకోసం.. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి 2014 వరకు వచ్చిన నిధులకంటే.. ఈ పదేళ్లలో రెట్టింపు నిధులు మోదీ గారు ఇచ్చారని, అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయని అమిత్‌ షా మండిపడ్డారు.

ఈ పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజలు ఈసారి వీలైనన్ని ఎక్కువసీట్లలో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టనున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా.. నడిపేది మజ్లిస్ పార్టీయే అని ఆయన అన్నారు. తెలంగాణల్ 4శాతం ముస్లిం రిజర్వేషన్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమేనని, మేం రాగానే.. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని, 2 లక్షల రుణమాఫీని సోనియా జన్మదినం రోజు చేస్తామన్నారని, సోనియా ఎన్నవ పుట్టినరోజు అనేది చెప్పలేదన్నారు అమిత్‌ షా. రైతులకు రూ.15వేల రైతు భరోసా అన్నారు. అది కూడా చేయలేదని, క్వింటాలుపై ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తా అన్నారు ఇవ్వలేదన్నారు అమిత్‌ షా. మహిళలకు రూ.2500 ఇస్తామన్నారు అది కూడా చేయలేదని, ఇవేవీ చేయలేదు.. కానీ.. హైకమాండ్ కు ఇచ్చిన ఒక్క హామీని మాత్రం పూర్తిచేస్తున్నారన్నారు అమిత్‌ షా. దేశవ్యాప్తంగా ఎన్నికలకోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారని, కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశసమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.
Read Also : Viral News : టీడీపీ క్యాడర్‌కు అతిపెద్ద మోటివేషన్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • Lok Sabha Elections 2024
  • narendra modi

Related News

Mamata Banerjee

Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం స

  • Markapuram Road accident pm modi

    Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

  • Andhra Pradesh Govt Set To Increase Assembly And Lok Sabha Seats

    Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు..?

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Central Government Resolve RDT Foreign Funding Issue

    Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

Latest News

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

Trending News

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd