Aam Aadmi Party: కర్ణాటకపై ఆప్ ఫోకస్.. 224 స్థానాల్లో పోటీ
ఈ ఏడాది దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో జరగనున్న ఎన్నికల సమరానికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కూడా పూర్తి ఉత్సాహంతో సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా రాష్ట్రంలోని 224 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మంగళవారం ప్రకటించారు.
- By Gopichand Published Date - 09:07 AM, Wed - 1 February 23
ఈ ఏడాది దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో జరగనున్న ఎన్నికల సమరానికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కూడా పూర్తి ఉత్సాహంతో సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా రాష్ట్రంలోని 224 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మంగళవారం ప్రకటించారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాను రూపొందిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ, కాంగ్రెస్లను కూడా టార్గెట్ చేశారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ల తరహాలో ‘నమ్మా క్లినిక్’ని బీజేపీ వాగ్దానం చేస్తుండగా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోందని ఆప్ నేత అన్నారు. రెండు పార్టీలను అనుకరించే పార్టీలుగా ఆమె అభివర్ణించారు.
బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆప్ నాయకురాలు అతిషి.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తామని, మార్చి మొదటి వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ప్రకటించారు. ఢిల్లీ పాలనా విధానంలో కాపీ క్యాట్ వెర్షన్ ప్రజలకు అక్కర్లేదని, ఒరిజినల్ పాలన కావాలని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటకలో పూర్తి ఉత్సాహంతో ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది.
Also Read: Union Budget 2023: నేడు కేంద్ర బడ్జెట్.. వీటిపైనే దేశ ప్రజల భారీ అంచనాలు..!
‘నమ్మ క్లినిక్’ అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చిందని ఆప్ నాయకురాలు ఆరోపించారు. నాణ్యమైన వైద్యం అందించాలని బీజేపీ సీరియస్గా ఉంటే, ఇన్నాళ్లూ ఎందుకు చేయలేదు? అని అన్నారు. కర్ణాటకలో ‘వివేకా’ పథకం కింద 24 వేల తరగతులు (క్లాస్ రూమ్) ఇస్తామని హామీ ఇవ్వడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే గత ఐదేళ్లలో వాటిని ఎందుకు నిర్మించలేదన్నది నా ప్రశ్న. రాష్ట్రంలో కాషాయ పార్టీ అధికారంలో ఉన్నా ఏమీ చేయలేదని, ఇప్పుడు వాగ్దానాలు చేస్తోందని బీజేపీపై ఆమె మండిపడ్డారు.
ఈ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీని కూడా ఆప్ నాయకురాలు ఎగతాళి చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలోపు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఉచిత విద్యుత్ అందించాలని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. అప్పుడే కర్నాటక ప్రజలు ఉచిత కరెంటు ఇస్తామన్న పార్టీ హామీని నమ్ముతారని ఆమె అన్నారు. ఢిల్లీలో కల్కాజీ ఎమ్మెల్యే అతిషి మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం ఎన్నికల ఎజెండాను ఆమ్ ఆద్మీ పార్టీ నిర్దేశించిందని అన్నారు. అవినీతితో విసిగి పోయిన ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం తీసుకురాగలమని, ప్రజలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఇవ్వగలమని మా పార్టీ చేసి చూపించిందని అన్నారు. మా పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులవడానికి ఇదే కారణమని ఆమె తెలిపారు.
Related News
Kejriwal: ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే ..కోర్టులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం అంశంలోని మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ(ED) ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది. Enforcement Directorate moves a remand application in Rouse Avenue court stating that we require […]