Aadhar Update : ఇకపై పదేళ్లకొకసారి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. ఎందుకంటే..?
పదేళ్లకొకసారి ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐఏ సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల...
- By Prasad Published Date - 03:30 PM, Sat - 17 September 22
పదేళ్లకొకసారి ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐఏ సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల వారికి ఈ అప్డేట్ తప్పనిసరి కాగా ఇదే తరహాలో పెద్దలు కూడా చేసుకోవాలని కోరింది. పదేళ్లకొకసారి వయోజనులు తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ)సూచించింది . ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వారికి అప్డేేట్ తప్పనిసరిగా ఉంది. కాగా వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. మేఘాలయ, నాగాలాండ్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వయోజనుల ఆధార్ కార్డులను అప్డేట్ చేశామని తెలిపారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) సమస్య కారణంగా మేఘాలయలో ఈ ప్రక్రియ ఆలస్యంమైందని తెలిపింది.
నాగాలాండ్, లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్డులు మంజూరు చేయాల్సి ఉందని యూఐడీఏఆ సంస్థ పేర్కోంది. ప్రస్తుతం ఆధార్ కలిగిన వారి శాతం 93.5 శాతానికి చేరుకుందని.. ఒక్క ఆగస్టు నెలలోనే 24.2 లక్షలమంది కొత్తగా నమోదయ్యారని చెప్పింది. దేశంలో దాదాపు 50,000 ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఉన్నాయని.. ఫోన్ నంబర్, చిరునామాలను అప్డేట్ చేసేందుకు 1,50,000 మంది పోస్ట్ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా.. ప్రజాధనం ఆదా చేయడానికి సహాయపడుతుందని తెలిపింది. పేపర్లెస్ ప్రయాణాలను పేపర్లెస్గా చేయాలని లక్ష్యంతో విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘డిజియాత్ర’ ధ్రువీకరణ కోసం ఆధార్ను అనుసందానం చేయనున్నట్లు పేర్కొంది.
Related News
Lok Sabha Polls : నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు
నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది