Mumbai-Bangalore Highway: ముంబై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- By Gopichand Published Date - 09:10 AM, Sun - 23 April 23
ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ముంబై వెళుతున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. ఈ సంఘటన అంబేగావ్ ప్రాంతంలోని స్వామి నారాయణ్ దేవాలయం సమీపంలో జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, పూణె-పీఎంఆర్డీఏ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ బస్సు నుంచి బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు సతారా నుంచి ముంబై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు.. బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. 22 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేక్ ఫెయిలైనందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Delta Airlines: విమానంలో సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన.. బలవంతంగా ముద్దు పెట్టిన ప్రయాణికుడు..!
శనివారం అయోధ్యలో కూడా ఇలాంటి ఘటనే జరిగి 7 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నుంచి అంబేద్కర్ నగర్ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, 7 మంది మరణించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా విచారం వ్యక్తం చేశారు.
Related News
Tragedy in Mumbai: ముంబైలో దారుణం.. టార్చ్ లైట్ వేసి ఆపరేషన్.. తల్లీబిడ్డ మృతి
ముంబైలో తీవ్ర విషాదం నెలకొంది. భాండూప్లోని సుష్మా స్వరాజ్ పాలికా ప్రసూతి గృహంలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ప్రసవ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం కారణంగా ఫ్లాష్లైట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు