HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Why We Need To Take Curd In Lunch

Curd in Lunch: మధ్యాహ్న భోజనంలో పెరుగు తప్పనిసరిగా తినాలట.. ఎందుకో తెలుసా?

ప్రతిరోజూ చేసే భోజనాన్ని పెరుగుతో ముగించకపోతే.. కొందరికి భోజనం చేసినట్టు కూడా అనిపించదు. చాలామంది పెరుగును డిసర్ట్ గా, స్నాక్ గా కూడా తీసుకుంటూ ఉంటారు.

  • Author : News Desk Date : 05-12-2023 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
benefits with curd
benefits with curd

Curd in Lunch: పెరుగు.. ఇందులో ఉండే మంచి బాక్టీరియా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆహారంలో భాగంగా పెరుగును కూడా తింటుంటాం. తాజా పెరుగు చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజూ చేసే భోజనాన్ని పెరుగుతో ముగించకపోతే.. కొందరికి భోజనం చేసినట్టు కూడా అనిపించదు. చాలామంది పెరుగును డిసర్ట్ గా, స్నాక్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ.. పెరుగును భోజనంతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనంలో మాత్రం పెరుగు తినకూడదని చెబుతున్నారు.

రాత్రి భోజనం తర్వాత పెరుగు తింటే కడుపులో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

పెరుగును మధ్యాహ్న భోజనంలో తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. కారిస్టాల్, స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించి.. బరువు పెరగకుండా అదుపు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. పెరుగు తినడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

ముఖ్యంగా మహిళలు మధ్యాహ్న భోజనంలో పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల యోని ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పెరుగులో ఉండే లక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా యోని ఇన్ఫెక్షన్లు రాకుండా అరికట్టడంలో దోహదపడతాయి. అధిక రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.

మధ్యాహ్న భోజనంతో పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. విడిగా పెరుగును తినేకంటే.. భోజనంలో కలిపి తీసుకుంటే మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits with curd
  • Curd in Lunch
  • healthy food
  • lactic acid
  • uses of curd

Related News

    Latest News

    • మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి

    • ల‌క్నో జ‌ట్టుకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడు దూరం!

    • భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ‌ధ్య టీ20 ర‌ద్దు.. అభిమానులు ఆగ్ర‌హం!

    • సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

    Trending News

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd