Health Benefits: శీతాకాలంలో కివి పండ్లను తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మామూలుగా చలికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అలాగే శీతాకాలంలో మనం తీసుకునే ఫుడ్ విషయంలో
- By Nakshatra Published Date - 05:35 PM, Wed - 20 December 23
మామూలుగా చలికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అలాగే శీతాకాలంలో మనం తీసుకునే ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని కూడా చెబుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలను తప్పకుండా తినాలని కూడా చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది కొన్ని రకాల పండ్లు చలికాలంలో తినవచ్చా తినకూడదా అని సందేహపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో కివి పండు కూడా ఒకటి. చలికాలంలో ఈ కివి పండును తినవచ్చు లేదో, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కివి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కివిలో ఉండే విటమిన్ కె, పొటాషియం, పొలిట్ ,కాపర్ ,విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటిలో తక్కువగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్ క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన వెంటనే శక్తి కలుగుతుంది. కివి పండ్లలో ఉండే ఫైబర్ ఫైట్ కెమికల్స్ శరీర అవయాల పనితీరును మెరుగుపడేలా చేస్తాయి. అలాగే ప్రేగులు, కడుపు పెద్ద పేగు క్యాన్సర్ని తగ్గించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.
ఈ పండ్లలో సెరో టోనీస్ ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపడేలా చేసి మంచి నిద్ర వచ్చేలా చేసింది. మెదడులోని సెరోటీన్స్ పెంచడం వలన నిద్ర నాణ్యత పెరుగుతుంది. విటమిన్ సి నిమ్మ,నారింజ లలో మాత్రమే కాకుండా కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కివి పండ్లలో కూడా 154% ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. బరువు తగ్గేలా చేస్తుంది.. ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో వచ్చే ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. రక్తపోటు సమస్య కూడా తగ్గిపోయేలా చేస్తుంది. ఇందులో ఎంజైమ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని ప్రోటీన్ జీర్ణక్రియలో బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘాలిక మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఇది గొప్ప వరం లాగా పనిచేస్తుంది.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.