Asthma: వేడి నీళ్లల్లో తేనె కలుపుకుని తాగితే ఆస్తమా తగ్గుతుందా..?
ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిని ఆస్తమా వేధిస్తోంది. ఆస్తమా వల్ల ముక్కు రంధ్రాలు బిగించుకుపోయి గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
- By Nakshatra Published Date - 04:09 PM, Sun - 7 May 23
Asthma: ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిని ఆస్తమా వేధిస్తోంది. ఆస్తమా వల్ల ముక్కు రంధ్రాలు బిగించుకుపోయి గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో ఊపిరి సరిగ్గా ఆడక ఆస్తమా రోగులు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కొన్నిసార్లు చికిత్స తీసుకున్నా ఆస్తమా తగ్గదు. దీంతో ఒకసారి ఆస్తమా బారిన పడితే తగ్గడానికి చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు గట్టిగా ఊపిరితీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఆస్తమా రోగులు ఇన్హేలర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని వల్ల ఆస్తమా నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా తగ్గేంతవరకు ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది. లేకపోతే గాలి సరిగ్గా ఊపిరితిత్తులకు వెళ్లక ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆస్తమాకు ఆయుర్వేద చికిత్సలు కూడా అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి తేనె. కొంతమంది వేడి నీళ్లల్లో తేనె కలుపుని తాగడం వల్ల ఆస్తమా తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో రోజూ వేడి వేడి నీళ్లల్లో కాస్త తేనె వేసుకుని తాగుతూ ఉంటారు.
తేనెలో ప్రకృతి నుంచి సహజసిద్దంగా లభిస్తుంది. దీంతో ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషక విలువలు ఉంటాయి. దీంతో తేనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రోగ నిరోధక కారకాలు ఎక్కువగా తేనెలు ఉంటాయి. దీని వల్ల ఆస్తమా తగ్గుతుంది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కానీ వైద్యులు మాత్రం వేడి నీళ్లల్లో తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల మాత్రమే ఆస్తమా తగ్గదని చెబుతున్నారు. ఇన్హేలర్స్ వాడుతూనే తేనె తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక రోజూ వ్యాయామం చేయాలని చెబుతన్నారు. అలాగే ధూమపానంకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Related News
Premature Menopause : అకాల రుతువిరతి ముందస్తు మరణ ప్రమాదాన్ని పెంచుతుంది
40 ఏళ్లలోపు మెనోపాజ్లోకి ప్రవేశించిన మహిళలు యవ్వనంగా చనిపోయే అవకాశం ఉందని ఒక అధ్యయనం కనుగొంది.