Pregnancy: ప్రెగ్నెన్సీ మహిళలు చేసే తప్పులు ఇవే.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి?
మహిళలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. పెళ్లి అయిన ప్రతి ఒక మహిళ కూడా తల్లి అవ్వాలని ఎంతో
- By Nakshatra Published Date - 07:00 AM, Sun - 20 November 22
మహిళలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. పెళ్లి అయిన ప్రతి ఒక మహిళ కూడా తల్లి అవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది. కానీ కొంతమంది పెళ్లి అయి కొన్నేళ్లు అయినా కూడా పిల్లలు కలగక గుళ్ళు, గోపురాలు,హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అయితే గర్భం దాల్చిన మహిళలు బిడ్డ పుట్టే వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా గర్భం సమయంలో మహిళల్లో అనేక రకాల మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే శరీరంలో విడుదల అయ్యే హార్మోన్లు బరువు పెరగడానికి అలాగే ఎద భాగం పెరగడానికి కారణం అవుతాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు తెలిసి, తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గర్భం దాల్చిన తర్వాత చాలామంది మహిళలలో నీరసం కళ్ళు తిరగడం వాంతులు అవ్వడం ఇలాంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దాంతో ఏది తినాలని అనిపించదు. ఆ సమయంలో చాలామంది మహిళలు భోజనం చేయకుండా మానేస్తూ ఉంటారు. అయితే అలా ఉన్నప్పుడు భోజనం చేయకుండా ఉండడం అన్నది అంత ఆరోగ్యకరమైనది కాదు. మరి ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు నాలుగు నెలల వరకు మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే కడుపులో ఉన్న శిశువు అవయవాలు ఏర్పడడానికి అభివృద్ధి చెందాడానికి చాలా కీలక సమయం కాబట్టి ఆ సమయంలో కచ్చితంగా మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భం దాచిన తర్వాత మహిళలు బరువు పెరుగుతూ ఉంటారు. అటువంటప్పుడు మహిళలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొంతమంది చాలా లావుగా ఉంటున్నాము లావు అయిపోతున్నాము అంటూ ఆందోళన చెందుతూ ఉంటారు.
ఆ ఆందోళన ప్రభావం కడుపులో ఉండే బిడ్డపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి బరువు గురించి పక్కన పెట్టి ప్రశాంతంగా ఉంటూ సరైన పోషకాహారం తీసుకోవాలి. అయితే గర్భం దాల్చిన తర్వాత మనకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కడుపుబ్బరంగా ఉండటం కండరాల నొప్పులు జీర్ణశయ సమస్యలు ఇలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటప్పుడు చాలామంది రకరకాల మందులను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల కడుపులో ఉండే బిడ్డకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయడం చాలా మంచిది. అలా అని ఎక్కువగా శ్రమ పడకూడదు. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే ప్రతి నెల డాక్టర్ ని సంప్రదించి ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు వంటి అనారోగ్యకరమైన ఆహారాలుకు దూరంగా ఉండటం మంచిది.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.