Diabetes Patients : షుగర్ తో బాధపడుతున్నారా..? అయితే ఈ పప్పు తినండి..చాల కంట్రోల్ చేస్తుంది
కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది షుగరేనే కాదు బీపీని కూడా కంట్రోల్ చేస్తుందట. అందుకే షుగర్ పేషెంట్లు తప్ప కుండా కందిపప్పు తినాలని చెపుతున్నారు.
- By Sudheer Published Date - 03:52 PM, Fri - 6 October 23
షుగర్ (Diabetes ) ..ఒకప్పుడు ఇది అంటేనే తెలియదు..కానీ ఇప్పుడు ఏ ఇంట్లో చూసిన కనీసం ఇద్దరు , ముగ్గురు షుగర్ తో బాధపడుతున్నారు. ఈ షుగర్ వచ్చిన వారు ఇష్టపూర్తిగా ఏమి తినలేరు..తాగలేరు. ఏంచేయాలన్న టైం ప్రకారమే..టైం బట్టే..టైంతో పాటే తినాలి. అది కూడా ఇష్టం వచ్చినట్లు ఇంత పడితే అంత కూడా తినకూడదు. అందుకే జన్మలో కూడా షుగర్ రావొద్దని షుగర్ పేషంట్లు కోరుకుంటుంటారు.
మనదేశంలో (India) చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్ వినియోగం డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణం అని అధ్యయనం చేసిన నిపుణుల బృందం చెపుతుంది. మన మొత్తం క్యాలరీలలో 60 నుండి 75 శాతం కార్బోహైడ్రేట్ల రూపంలో ఉంటుంది మరియు 10 శాతం మాత్రమే ప్రోటీన్లను కలిగి ఉంటుంది. వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది వచ్చిందంటే అంతే సంగతి..జీవితంతో కంట్రోల్ చేసుకుంటూ బ్రతకాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join.
అయితే కంది పప్పు (Toor/Arhar Dal)తో కూడా షుగర్ (Diabetes ) కంట్రోల్ అవుతుందట. ఏంటి నమ్మడం లేదా..? నిజమండి. కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది షుగరేనే కాదు బీపీని కూడా కంట్రోల్ చేస్తుందట. అందుకే షుగర్ పేషెంట్లు తప్ప కుండా కందిపప్పు తినాలని చెపుతున్నారు.
ఆరోగ్య నిపుణుల చెపుతున్న ప్రకారం.. ఆక్సీకరణ ఒత్తిడి పెరగడం వల్ల మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరగడం మొదలవుతుంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కందిపప్పు అధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని చెపుతున్నారు. ఈ పప్పును నిత్యం తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందట. మొలకెత్తిన పచ్చి పప్పు హైపర్గ్లైసీమియాను అంటే అధిక రక్త చక్కెరను నియంత్రించడంలో కూడా చాల మేలు చేస్తుందని చెపుతున్నారు. ఇది అధిక మొత్తంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా కాపాడుతుందట. అలాగే కందిపప్పు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుందని , పప్పులో ఫైబర్ పుష్కలంగా లభించడం వల్ల..పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీనితో పాటు అతిగా తినడం కూడా నివారించవచ్చు అని చెపుతున్నారు.
Read Also : Sugar Affect: మీరు స్వీట్లు ఎక్కువ తింటున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!
Related News
Diabetes: అమ్మో.. మధుమేహం.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే చెక్ పెట్టండి
Diabetes: రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనికి చికిత్స లేదు. ఇది మాత్రమే నియంత్రించబడుతుంది. 2021 సంవత్సరంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 537 మిలియన్లు అంటే 20-79 సంవత్సరాల వయస్సు గల 53.7 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 2045 నాటికి, ఈ సంఖ్య 783 మిలియన్లకు అంటే 78.3 కోట్లకు పెరుగుతుందన�