HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Fact Check
  • >Italy Says If India Gives Green Signal To It Pakistan Will Be Wiped Off The World Map

Fact Check: మోడీ చెప్తే.. పాకిస్తాన్ లేకుండా చేస్తానన్న ఇటలీ ప్రధాని

‘‘నా మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ (Fact Check) ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను’’ అని

  • By Pasha Published Date - 07:53 PM, Sun - 4 May 25
  • daily-hunt
Italy Vs Pakistan India Vs Pakistan Fact Check

Fact Checked By factly

ప్రచారం : 2025 ఏప్రిల్ 22న  పహల్గామ్‌ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అనుమతి లభిస్తే..  ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తానని ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ అన్నారు అనే ప్రచారం జరిగింది.

వాస్తవం :  ఈ విధమైన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని మెలోనీ చేయలేదు. వైరల్ అవుతున్న క్లిప్ అనేది 2019లో ఐరోపా ఎన్నికల ప్రచారంలో మెలోనీ ప్రసంగించిన వీడియోలోనిది.  ఈ క్లిప్‌లో ఆమె ప్రధాని మోడీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు. కాబట్టి ఈ పోస్టులో ఉన్న క్లెయిమ్ తప్పు.

‘‘నా మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ (Fact Check) ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను’’ అని ఇటలీ ప్రధాని మెలోనీ చెప్పారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చూడొచ్చు. అసలు ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..

వాస్తవ తనిఖీలో గుర్తించిన అంశాలివీ..

ఈ ప్రచారానికి సంబంధించిన  ఆర్కైవ్డ్ వర్షన్‌ను మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రచారం వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి మేం కీవర్డ్స్‌ను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాం.  పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న  జరిగిన ఉగ్రవాద దాడిపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారని మేం గుర్తించాం. అయితే..  ప్రధాని మోదీ అనుమతిస్తే, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని మెలోని అన్నట్లుగా ట్వీట్ కానీ, వీడియో క్లిప్ కానీ మాకు కనిపించలేదు.  ఈ వాదనకు రుజువుగా వార్తా కథనాలేవీ మాకు లభించలేదు.

Profondamente addolorata per l’attacco terroristico avvenuto oggi in India, che ha causato numerose vittime. L’Italia esprime vicinanza alle famiglie colpite, ai feriti, al Governo e a tutto il popolo indiano.

— Giorgia Meloni (@GiorgiaMeloni) April 22, 2025

కీ ఫ్రేమ్స్‌తో సెర్చ్ చేయగా.. 

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. తద్వారా ఈ వీడియో యొక్క అన్‌క్రాప్డ్ వర్షన్ మాకు యూట్యూబ్‌లో దొరికింది. వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ వీడియో యొక్క 00:13 మార్క్ దగ్గరి నుంచి సరిపోలడాన్ని మేం గుర్తించాం.  ఈ వీడియోను 2019 ఏప్రిల్ 14న   ‘Vista Agenzia Televisiva Nazionale’ అనే ఇటాలియన్ మీడియా సంస్థ తమ అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. దీని బట్టి ఈ వీడియోకు 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడితో ఎటువంటి సంబంధం లేదని మేం గుర్తించాం. ఈ  వీడియో యొక్క వివరణ ప్రకారం.. 2019 ఏప్రిల్ 14న  ట్యూరిన్‌లో జరిగిన Fratelli d’Italia(FDI) పార్టీ యొక్క 2019 ఐరోపా ఎన్నికల ప్రచార సభలో జార్జియా మెలోని ప్రసంగం చేశారు.

తన ప్రసంగాన్ని యూట్యూబ్‌లో ఉన్న ట్రాన్సలేట్ సదుపాయం ఉపయోగించి చూడగా, ఇందులో తను మాట్లాడుతూ ఫాబియో ఫాజీయో అనే వ్యక్తి పారిస్ రాజధాని అని అన్నాడని చెప్పారు. ఇలా అన్నందుకు తనని ఖండిస్తూ.. ఇటలీ రాజధాని రోమ్ అని మెలోని అన్నారు. అలాగే, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ నగరాన్ని పెట్టాలని తను ఐరోపాకు చెప్తానని ఈ ప్రసంగంలో మెలోని అన్నారు.

ఈ సభకు సంబంధించిన మరి కొన్ని వీడియోలను  ‘Vista Agenzia Televisiva Nazionale’ వారు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే, ఈ ప్రసంగం పూర్తి వీడియో మాకు Fratelli d’Italia వారి అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్‌ ఛానల్‌లో దొరికింది. ఈ ప్రసంగంలో తాను ఎక్కడా కూడా ప్రధాని మోడీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు.

ఇదే విషయంపై 2019లో ‘today’ అనే ఇటాలియన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.  ‘Globe Eye News’ అనే వార్తా సంస్థ ఈ వీడియో క్లిప్‌ను ‘X’లో పోస్ట్ చేస్తూ, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ ఉండాలని మెలోనీ అన్నారని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 14న  ట్యూరిన్‌లో జరిగిన  Fratelli d’Italia(FDI) పార్టీ ఎన్నికల ప్రచార సభ గురించి ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ప్రధాని మోడీ ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న వార్తలన్నీ తప్పులే.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘factly’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fact Check
  • Giorgia Meloni
  • india
  • India vs Pakistan
  • italy
  • Italy Vs Pakistan
  • pakistan
  • pm modi
  • World Map

Related News

Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

కేంద్రం నుండి రాష్ట్రానికి అవసరమైన మద్దతు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ లోతుగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ముఖ్యాంశంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు అంశం ప్రస్తావించబడింది.

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

Latest News

  • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

  • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

  • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

  • YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి!

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

    • GST 2.0: 40 శాతం జీఎస్టీతో భార‌మేనా? సిగ‌రెట్ ప్రియుల జేబుకు చిల్లు త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd