HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Fact Check
  • >Italy Says If India Gives Green Signal To It Pakistan Will Be Wiped Off The World Map

Fact Check: మోడీ చెప్తే.. పాకిస్తాన్ లేకుండా చేస్తానన్న ఇటలీ ప్రధాని

‘‘నా మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ (Fact Check) ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను’’ అని

  • By Pasha Published Date - 07:53 PM, Sun - 4 May 25
  • daily-hunt
Italy Vs Pakistan India Vs Pakistan Fact Check

Fact Checked By factly

ప్రచారం : 2025 ఏప్రిల్ 22న  పహల్గామ్‌ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అనుమతి లభిస్తే..  ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తానని ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ అన్నారు అనే ప్రచారం జరిగింది.

వాస్తవం :  ఈ విధమైన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని మెలోనీ చేయలేదు. వైరల్ అవుతున్న క్లిప్ అనేది 2019లో ఐరోపా ఎన్నికల ప్రచారంలో మెలోనీ ప్రసంగించిన వీడియోలోనిది.  ఈ క్లిప్‌లో ఆమె ప్రధాని మోడీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు. కాబట్టి ఈ పోస్టులో ఉన్న క్లెయిమ్ తప్పు.

‘‘నా మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ (Fact Check) ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను’’ అని ఇటలీ ప్రధాని మెలోనీ చెప్పారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చూడొచ్చు. అసలు ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..

వాస్తవ తనిఖీలో గుర్తించిన అంశాలివీ..

ఈ ప్రచారానికి సంబంధించిన  ఆర్కైవ్డ్ వర్షన్‌ను మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రచారం వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి మేం కీవర్డ్స్‌ను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాం.  పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న  జరిగిన ఉగ్రవాద దాడిపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారని మేం గుర్తించాం. అయితే..  ప్రధాని మోదీ అనుమతిస్తే, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని మెలోని అన్నట్లుగా ట్వీట్ కానీ, వీడియో క్లిప్ కానీ మాకు కనిపించలేదు.  ఈ వాదనకు రుజువుగా వార్తా కథనాలేవీ మాకు లభించలేదు.

Profondamente addolorata per l’attacco terroristico avvenuto oggi in India, che ha causato numerose vittime. L’Italia esprime vicinanza alle famiglie colpite, ai feriti, al Governo e a tutto il popolo indiano.

— Giorgia Meloni (@GiorgiaMeloni) April 22, 2025

కీ ఫ్రేమ్స్‌తో సెర్చ్ చేయగా.. 

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. తద్వారా ఈ వీడియో యొక్క అన్‌క్రాప్డ్ వర్షన్ మాకు యూట్యూబ్‌లో దొరికింది. వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ వీడియో యొక్క 00:13 మార్క్ దగ్గరి నుంచి సరిపోలడాన్ని మేం గుర్తించాం.  ఈ వీడియోను 2019 ఏప్రిల్ 14న   ‘Vista Agenzia Televisiva Nazionale’ అనే ఇటాలియన్ మీడియా సంస్థ తమ అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. దీని బట్టి ఈ వీడియోకు 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడితో ఎటువంటి సంబంధం లేదని మేం గుర్తించాం. ఈ  వీడియో యొక్క వివరణ ప్రకారం.. 2019 ఏప్రిల్ 14న  ట్యూరిన్‌లో జరిగిన Fratelli d’Italia(FDI) పార్టీ యొక్క 2019 ఐరోపా ఎన్నికల ప్రచార సభలో జార్జియా మెలోని ప్రసంగం చేశారు.

తన ప్రసంగాన్ని యూట్యూబ్‌లో ఉన్న ట్రాన్సలేట్ సదుపాయం ఉపయోగించి చూడగా, ఇందులో తను మాట్లాడుతూ ఫాబియో ఫాజీయో అనే వ్యక్తి పారిస్ రాజధాని అని అన్నాడని చెప్పారు. ఇలా అన్నందుకు తనని ఖండిస్తూ.. ఇటలీ రాజధాని రోమ్ అని మెలోని అన్నారు. అలాగే, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ నగరాన్ని పెట్టాలని తను ఐరోపాకు చెప్తానని ఈ ప్రసంగంలో మెలోని అన్నారు.

ఈ సభకు సంబంధించిన మరి కొన్ని వీడియోలను  ‘Vista Agenzia Televisiva Nazionale’ వారు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే, ఈ ప్రసంగం పూర్తి వీడియో మాకు Fratelli d’Italia వారి అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్‌ ఛానల్‌లో దొరికింది. ఈ ప్రసంగంలో తాను ఎక్కడా కూడా ప్రధాని మోడీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు.

ఇదే విషయంపై 2019లో ‘today’ అనే ఇటాలియన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.  ‘Globe Eye News’ అనే వార్తా సంస్థ ఈ వీడియో క్లిప్‌ను ‘X’లో పోస్ట్ చేస్తూ, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ ఉండాలని మెలోనీ అన్నారని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 14న  ట్యూరిన్‌లో జరిగిన  Fratelli d’Italia(FDI) పార్టీ ఎన్నికల ప్రచార సభ గురించి ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ప్రధాని మోడీ ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న వార్తలన్నీ తప్పులే.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘factly’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fact Check
  • Giorgia Meloni
  • india
  • India vs Pakistan
  • italy
  • Italy Vs Pakistan
  • pakistan
  • pm modi
  • World Map

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

  • India Forex Reserve

    India Forex Reserve: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుదల!

Latest News

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

  • ‎Tooth Pain: పంటి నొప్పిని భరించలేక పోతున్నారా.. అయితే ఇది పెడితే క్షణాల్లో నొప్పి మాయం!

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd