HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Fact Check
  • >Fact Check Media Outlets Falsely Claim Rashtrapati Bhavan Hosts First Ever Wedding

Fact Check : రాష్ట్రపతి భవన్‌లో తొలి పెళ్లి వేడుక.. మీడియా నివేదికలన్నీ తప్పుల తడకలే

ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పూనమ్ గుప్తా(Fact Check) వివాహం గురించి మీడియా సంస్థలు తప్పుగా సమాచారాన్ని నివేదించాయి.

  • By Pasha Published Date - 06:26 PM, Mon - 17 February 25
  • daily-hunt
Rashtrapati Bhavan First Wedding Fact Check Media Outlets False Claim

Fact Checked By boomlive

ప్రచారం :  రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా వివాహం జరిగింది.

వాస్తవం  : ఈ వాదన తప్పు అని BOOM గుర్తించింది. రాష్ట్రపతి భవన్ అధికారిక డిజిటల్ ఫొటో లైబ్రరీలోని ఫోటోలను మేం చెక్ చేశాం. అధికారిక రాష్ట్రపతి నివాసం గతంలో అనేక వివాహాలకు వేదికగా నిలిచిందని గుర్తించాం. 

Also Read :National Parties Vs Incomes: ఆదాయంలో టాప్-3 జాతీయ పార్టీలపై ఏడీఆర్ సంచలన నివేదిక 

భారతదేశ చరిత్రలో తొలిసారిగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహం జరిగిందని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి, ప్రచురించాయి.

వాస్తవం ఏమిటంటే.. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రపతి భవన్ అనేక వివాహాలకు వేదికగా నిలిచిందని BOOM నిర్ధారించగలిగింది. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌లో 2016 వరకు ఫొటో ఆర్కైవ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పూనమ్ గుప్తా(Fact Check) వివాహం గురించి మీడియా సంస్థలు తప్పుగా సమాచారాన్ని నివేదించాయి. రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా పూనమ్ గుప్తా నిలిచారని ఆయా కథనాల్లో ప్రస్తావించారు.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అధికారిణిగా ఉన్న గుప్తా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి (PSO) బృందంలో సభ్యురాలిగా ఉన్నారు.

2025 ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి చేసుకున్న పూనమ్ గుప్తా,  అక్కడ మ్యారేజ్ చేసుకున్న తొలి వ్యక్తి అని వార్తా సంస్థలు మిర్రర్ నౌ, న్యూస్ ఎక్స్, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ టీవీ కథనాలను ప్రచురించాయి.

Also Read :Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి వివాహం ఇదేనని అనేక మీడియా సంస్థలు తప్పుగా నివేదించాయి. వీటిలో ఇండియా టుడే , న్యూస్ ఎక్స్ , మిర్రర్ నౌ , సిఎన్‌బిసి టివి 18 , డెక్కన్ హెరాల్డ్ , రిపబ్లిక్ టివి , ఈటీవీ భారత్ , ది ఎకనామిక్ టైమ్స్ , టైమ్స్ ఆఫ్ ఇండియా , వార్త భారతి , మనీ కంట్రోల్ మరియు టైమ్స్ నౌ ఉన్నాయి .

PTI ఒక వీడియో నివేదికను ప్రసారం చేసింది. HT సిటీ ఢిల్లీ వివాహంపై తప్పుడు వాదనతో ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ చేసింది.

వాస్తవ తనిఖీలో ఏం తేలిందంటే..?

  • ఈ ప్రచారంలో వాస్తవికత లేదని బూమ్(BOOM)  గుర్తించింది. అది అబద్ధమని, రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో గతంలో చాలా వేడుకలు జరిగాయని నిర్ధారించింది.  రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్‌లోని డిజిటల్ ఫోటో లైబ్రరీని ‘బూమ్’ తనిఖీ చేయగా, గతంలో ఆ ప్రాంగణంలో జరిగిన వివిధ వివాహాలు, రిసెప్షన్‌ల ఫొటోలు కనిపించాయి.
  • 2016 అక్టోబర్‌లో, 2017 ఏప్రిల్‌లో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక వివాహానికి హాజరై, ఆ జంటతో కలిసి ఫోటో దిగిన ఫోటోలను మేం గుర్తించాం.
  • 2018 ఫిబ్రవరిలో  ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లో జరిగిన వివాహానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరైన ఫోటోలను కూడా మేం గుర్తించాం.
  • కేంద్ర ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ‘PIB ఫ్యాక్ట్ చెక్’..  “రాష్ట్రపతి భవన్ మొదటి నుంచే అనేక వివాహాలకు వేదికగా ఉంది” అని ఒక వివరణను విడుదల చేసింది. ఈ అంశంపై మీడియా తప్పుడు నివేదికలను ప్రచురించిందని  స్పష్టం చేసింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘boomlive’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Fact Check
  • False Claim
  • First Wedding In Rashtrapati Bhavan
  • Media Outlets
  • Rashtrapati Bhavan
  • Shakti Collective

Related News

India Cricket Team

PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు.

  • Rename Delhi

    Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాల‌ని అమిత్ షాకు లేఖ!

Latest News

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

  • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd