Srisailam: టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి
- By Balu J Published Date - 07:17 PM, Fri - 23 February 24
Srisailam: శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈసమావేశంay మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈఓ పెద్దిరాజు తెలిపారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించమన్నారు. శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
కర్నూలు నగరంలోని శ్రీశైలం దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం,వాణిజ్య సముదాయానికి 8 కోట్ల 60 లక్షల రూపాయలకు నిర్మాణానికి ఆమోదించారు. వీటితోపాటు సుండిపెంటలో నిర్మిస్తున్న దేవస్థానం సిబ్బంది వసతిగృహాలకు నీటి సరఫరా ఏర్పాటుకు అంచనా వ్యయం 15 కోట్లుతో ఆమోదం తెలిపారు. క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీరు పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయశాఖకు ప్రతిపాదనలకు తీర్మానించమన్నారు.
Related News
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుం�