Rules Of Ramakoti : రామకోటి రాస్తున్నారా? ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే.!!
రామకోటి..రాస్తున్నారా..? అయితే అది మంచి ఆలోచన..!! రామకోటి రాయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు..!!
- By hashtagu Published Date - 06:30 AM, Mon - 29 August 22
రామకోటి..రాస్తున్నారా..? అయితే అది మంచి ఆలోచన..!! రామకోటి రాయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు..!! కానీ రామకోటిని రాయడానికి ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఎలాపడితే అలా..ఎక్కడబడితే అక్కడ రామకోటి రాయడానికి వీల్లేదు. భక్తిశ్రద్ధలతో ఒక క్రమబద్ధమైన ప్రణాళికను ఏర్పరుచుని రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తేనే అంతా మంచి జరుగుతుంది.
రామకోటి రాయడానికి ఎలాంటి నియమాలు అనుసరించాలి..?
రామకోటిని సాధారణంగా పెద్దలు రాస్తుంటారు. వయస్సు మీదపడినవారు రామా…రామా అంటూ రామకోటిని రాయడం ప్రారంభిస్తారు. కానీ నిజానికి అది చిన్ననాటి నుంచే రాస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రామకోటి రాయడానికి ఎలాంటి నియమాలు అనుసరించాలో తెలుసుకుందాం. మీకు రామకోటి రాయాలన్న ఆలోచన ఉంటే…ముందుగా మీరు భక్తితో దేవుడి వద్ద సంకల్పం తీసుకోవాలి. అప్పుడు మానసికంగా, ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా హాయిగా ఉంటుంది.
-శ్రీరామ…అనే పదం రాయసేందుకు వీలుగా ఉండే కోటి గళ్లున్న పుస్తకాన్ని తెచ్చుకోవాలి. అలా కుదరకుంటే…మీరే ఒక తెల్లకాగితాలతో ఒక పుస్తకాన్ని తయారు చేసుకోవాలి. అందులో కోటి గళ్లు చేసుకుని రాయడం మొదలు పెట్టవచ్చు.
-రామకోటి మొదలుపెట్టే ముందు శాస్త్రాల ప్రకారం ఒక మంచి సమయం, రోజును కేటాయించుకోవాలి. మీరు రాయాల్సిన పుస్తకానికి పసుపు, కుంకుమరాసి…దేవుని సన్నిధిలో శ్రీరామ అష్టోత్తరశతనామావళితో పూజా చేయాలి. ఆ తర్వాత పుస్తకంలో రాయడం ప్రారంభించాలి.
-రామకోటి పుస్తకం రాస్తున్నప్పుడు మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు. మనస్సు ప్రశాంతంగా…హాయిగా ఉంచుకోవాలి. ఎలాంటి చింతలు పెట్టుకోకూడదు. దేవుని మీద భక్తితో, ఏకాగ్రతతో మనస్సును కేంద్రీకరించి రామా రామా అంటూ మనస్సులో అనుకుంటూ రాయాలి. పుస్తకం రాస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా అవసరం ఉంటే…సరిసంఖ్యలో పుస్తకాన్ని ఆపివేయాలి. తిరిగి ప్రారంభించే ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోని మళ్లీ రాయడం మొదలు పెట్టాలి.
-రామకోటి రాసే కలాన్ని ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. అదేవిధంగా పుస్తకంలో ఎలాంటి ఇతర విషయాల గురించి రాయకూడదు. ముఖ్యంగా రామకోటి రాసినతర్వాత ఆరోజు ఆ పుస్తకాన్ని దేవుడి సన్నిధిలోనే ఉంచడం మంచిది. ఇక రామకోటిని మనస్సు పూర్తిగా రాయాలి..బలవంతంగా రాయకూడదు. మీకు రాయాలనే సంకల్పం కలిగినప్పుడే దానిని పూర్తి చేయాలి. అలా రాయడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఉండదు. కానీ పవిత్రత మాత్రం తప్పకుండా పాటించాలి.
-రామకోటి రాస్తున్న పుస్తకంలో ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. నివేదన చేసుకుంటే మంచిది. తర్వాత అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. రామకోటి పుస్తకం రాయడం పూర్తయిన తర్వాత పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు.
-ఈ విధంగా రామకోటి పుస్తకం రాయడం పూర్తయిన తర్వాత ఏదైన రామునిగుడిలో ఆధ్యాత్మిక వ్యక్తికి అప్పగించాలి. ఈ విషయాలు తప్పకుండా పాటించాలి.
Related News
Helicopter Services: హెలికాప్టర్ ద్వారా చార్ ధామ్ యాత్ర.. ఛార్జీల వివరాలివే..!
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించడం ద్వారా చార్ ధామ్ యాత్రను పూర్తి చేస్తారు.