HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Most Of These Names Are In This Town What Is That Town What Are Those Names

Names: ఈ ఊరిలో ఎక్కువగా ఈ పేర్లే ఉంటాయి.. ఇంతకీ ఆ ఊరేంటి? ఆ పేర్లేంటి?

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులూ ఈ సాంప్రాదాయాన్ని పాటిస్తున్నారు. పేదోల్లకు పెద్దదిక్కుగా నిలిచే వేములవాడ రాజన్న విషయంలో తరతరాలుగా

  • Author : Vamsi Chowdary Korata Date : 05-03-2023 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Most Of These Names Are In This Town.. What Is That Town What Are Those Names
Most Of These Names Are In This Town.. What Is That Town What Are Those Names

ఎక్కడ మొక్కులు తీర్చుకోవాలన్నా ఇక్కడ దర్శనం చేసుకునే ఆనవాయితీ తరతరాలుగా కొనసాగుతోంది. మేడారం సమ్మక్క, సారలక్క అయినా.. తిరుపతి వెంకన్న అయినా..శ్రీశైలం మల్లన్న అయినా ఇలా ఏ గుడికి వెళ్లిన ముందుగా కోడెమొక్కుల వాడి సన్నిధికి వెల్లి దండం పెట్టి అనుమతి తీసుకుంటుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులూ ఈ సాంప్రాదాయాన్ని పాటిస్తున్నారు. పేదోల్లకు పెద్దదిక్కుగా నిలిచే వేములవాడ రాజన్న విషయంలో తరతరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే రాజన్న వెలిసిన ఈ పట్టణంకు ఓ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఉండే వాళ్ల పేర్లు (Names) ఎక్కువగా శ్రీనివాసులే అని పెట్టుకుంటారట.

ఏడు కొండలపై వెలిసిన శ్రీనివాసున్ని తల్చుకుంటూ ఇక్కడ జీవిస్తుంటారట. కాస్తా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం. దక్షిణ కాశీగా విరుజిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం చాళుక్యుల కాలంలో రాజధానిగా వెలుగొందింది. శ్రీ రాజ రాజేశ్వరుని రూపంలో ఇక్కడ వెలిసిన భోళా శంకరుడు భక్తులకు కొంగుబంగారమై నిలుస్తుంటారని ప్రతీతి. మహిమాన్వితుడైన శివయ్య సన్నిధిలో జీవిస్తున్న వారు మాత్రం నిత్యం తిరుపతి వెంకన్న పేరునే తల్చుకుంటుంటారు. వెంకటేశ్వరునికి వివిధ పేర్లలో శ్రీనివాసుడు ఒకటి కాగా వేములవాడలో పుట్టిన వారిలో చాలా మందికి ఈ పేరు పెట్టుకుంటుంటారు. తిరుపతి, శ్రీనివాస్, రాజయ్య ఈ మూడు పేర్లు పెట్టుకున్న వారు వేములవాడలో ఎక్కువగా కనిపిస్తుంటారు. 60 శాతానికి పైగా ఈ పేర్లే గల వారే ఉండడం గమనార్హం.

పట్టణంలో నివసిస్తున్న వారిలో 50 నుండి 60 శాతం మంది పేర్లు (Names) శ్రీనివాస్ లేదా తిరుపతి అలాగే రాజయ్య అనే ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యం శ్రీనివాసుని నామస్మరణ ఈ రకంగా జరుగుతూనే ఉంటుందట. అయితే వేములవాడలో ఉన్న వారిలో చాలా మంది కూడా ఏడుకొండలపై వెలిసిన వెంకన్నను స్మరించుకుంటూ జీవించడం వెనక అసలు కారణం ఏంటన్న విషయంపై వివిధ రకాలుగా చెప్తున్నారు. అల్లంత దూరాన వెలిసిన తిరుపతి వెంకన్న పేరు పెట్టుకుని తమ వారసులకు మంచే జరుగుతుందన్న నమ్మకం కొందరిది. తరతరాలుగా శ్రీనివాసుని పేరు పెట్టుకోవడం ఆచారంగా వస్తుందని మరికొందరు చెప్తుంటే, కలియుగ అవతారం అయిన వెంకన్న స్మరణ మాత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో నిత్యకృత్యమనే చెప్పాలి. ఏది ఏమైనా ఆదిభిక్షువు వెలిసిన చోట శ్రీనివాస్, తిరుపతి అనే పేర్లతో ఎక్కువ మంది ఉండడం మాత్రం ఇక్కడ వైవిద్యతను చాటుతోందని చెప్పక తప్పదు.

ఇలాగే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గంగరాజు, గంగయ్య, గంగ జమున, గంగ అనే పేర్లతో దాదాపు 30 నుండి 40శాతం ఈ పేర్లతోనే ఎక్కువగా ఉంటారు. కారణం ఏమిటంటే ఇక్కడ కాకతీయ రాజుల కాలంలో ప్రతాపరుద్రుని మంత్రివర్గంలో ఒకరైన గంగాధర్ అనే చాణుక్యుడు గంగాధర గ్రామానికి పూర్వంలో పరిపాలించడట అలా ఆ గ్రామానికి గంగాధర అనే పేరు వెలిసిందట. అతని జ్ఞాపకార్థమే చాలా మందికి గంగాధర, గంగయ్య, గంగా, గంగ జమున అనే పేర్లు పెడుతున్నారట.

Also Read:  Pawan Kalyan: జగన్ పై మారిన పవన్ మనసు, విశాఖ సదస్సుపై ట్వీట్ దుమారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • god
  • Lord
  • Most
  • names
  • people
  • Place
  • states
  • Town

Related News

Bheeshma Ekadasi..

భీష్మ ఏకాదశి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే పాపాలు తొలగి అదృష్టం పొందొచ్చు..!

Bheeshma Ekadasi  కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యం వరకు వేచి ఉన్నాడు. అదే విధంగా మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు భీష్మాచార్య తన శరీరాన్ని త్యాగం చేశాడు. దీనిని భీష్మ అష్టమిగా కూడా జరుపుకుంటారు. భీష్మ అష్టమి తర్వాత 3 రోజుల తర్వాత భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో  భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్త

    Latest News

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

    • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

    • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    Trending News

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd