HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Is This The Meaning Behind Giving Harati After The Pooja Is Done

Pooja : పూజ పూర్తి అయిన తర్వాత హారతి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఇదే?

హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇక దీపారాధన తో పాటు పూజ (Pooja) పూర్తి అయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించడం అన్నది కూడా తప్పనిసరి.

  • Author : Naresh Kumar Date : 26-01-2024 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Is This The Meaning Behind Giving Harati After The Pooja Is Done..
Is This The Meaning Behind Giving Harati After The Pooja Is Done..

మామూలుగా హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇక దీపారాధన తో పాటు పూజ (Pooja) పూర్తి అయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించడం అన్నది కూడా తప్పనిసరి. ప్రతిరోజు కర్పూరం వెలిగించకపోతే ఆ పూజ సంపూర్ణం కాదు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకే తప్పకుండా పూజ (Pooja) పూర్తి అయిన తర్వాత కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వాలని చెబుతూ ఉంటారు. పూజ (Pooja) పూర్తయిన తర్వాత ఇలా దేవుడికి హారతి ఎందుకు ఇవ్వాలి? దాని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హారతి ఇచ్చినప్పుడు కొంచెయు కళ్లకు అద్దుకుంటూ ఉంటారు. అలా చేస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది.

ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు.

ఒకప్పుడు కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్ప అర్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది. భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి. ఇకపోతే హారతి వెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే.. పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించే హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం. ఇందులో కల్తీ ఉండదు. కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంద పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది.

ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.

Also Read:  Kinetic E Luna : త్వరలో మార్కెట్ లోకి రానున్న కైనెటిక్​ ఈ-లూనా.. ధర, ఫీచర్స్ ఇవే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • devotional
  • Done
  • Harati
  • pooja

Related News

Bheeshma Ekadasi..

భీష్మ ఏకాదశి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే పాపాలు తొలగి అదృష్టం పొందొచ్చు..!

Bheeshma Ekadasi  కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యం వరకు వేచి ఉన్నాడు. అదే విధంగా మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు భీష్మాచార్య తన శరీరాన్ని త్యాగం చేశాడు. దీనిని భీష్మ అష్టమిగా కూడా జరుపుకుంటారు. భీష్మ అష్టమి తర్వాత 3 రోజుల తర్వాత భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో  భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్త

    Latest News

    • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

    • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

    • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

    • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    Trending News

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

      • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

      • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

      • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd